భారత్లో ఒకవైపు డ్రై రన్ పేరుతో వ్యాక్సిన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది ప్రభుత్వం. డిసెంబర్ 28,29 తేదీలలో పంజాబ్, గుజరాజ్, ఆంధ్ర ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో నిర్వహించిన డ్రై రన్ విజయవంతం కావడం ప్రజలలో కొత్త ఆశలు రేపుతుంది. వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ముందుగా మాక్ డ్రిల్ తరహాలో ఈ డ్రై రన్ను నిర్వహించారు. ఈ వ్యాక్సిన్ డ్రిల్ కోసమని గుజరాజ్లో గాంధీ నగర్, రాజ్ కోట్.. పంజాబ్లో లుధియానా, షాహిద్ భగత్ సింగ్ నగర్.. అస్సాంలోని సోనిత్ పూర్, నల్బరి.. ఆంధ్ర ప్రదేశ్లో కృష్టా జిల్లాలోని 5 ప్రాంతాలలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి నిర్వహించిన డ్రై రన్ అనుకున్న తరహాలో విజయం సాధించడంతోపాటు.. అధికారులు ఏర్పాట్ల నిర్వహణపై ప్రాధమిక నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాలలో కొత్త కరోనా కేసులు
దేశమొత్తంలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారించిన ఆరోగ్య శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు మెల్లగా బయటపడుతుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే యుకే నుండి వచ్చిన వరంగల్ వ్యక్తికి కొత్త కరోనా గుర్తించిన అధికారులు.. ఇప్పుడు తాజాగా మరో మహిళకు కరోనా సోకినట్లుగా సీసీఎంబి నిర్ధారించారు. ఈమె యుకే నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం టిమ్స్లోని ఐసోలేషన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. ప్రైమరీ కాంటాక్ట్స్ని ట్రేస్ చేసే పనిలో పడ్డారు అధికారులు. ఢిల్లీ నుంచి తప్పించుకుని ఆంధ్ర ప్రదేశ్కు చేరుకున్న మహిళకు కొత్త కరోనా నిర్థారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె కుమారుడికి నెగిటివ్ వచ్చింది. ఆమె రైలు ప్రయాణంలో ఉన్న అందరినీ వెతికి పట్టుకునే పనిలో పడ్డారు అధికారులు.
Must Read ;- భారత్లోనూ మొదలైన కొత్త కరోనా ప్రకంపనలు











