కరోనాలో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో కొన్ని సాధారణమైనవి కాగా.. మరికొన్ని ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. వీటిన్నంటికీ చెక్ పెట్టగలిగేది వ్యాక్సిన్ మాత్రమే. అందుకోసమే భారత్ వ్యాక్సిన్ అనుమతులు ఇవ్వడానికి కసరత్తులు మొదలు పెట్టింది. ఇప్పటికే కొవిషీల్డ్, కొవ్యాక్సిన్, ఫైజర్ టీకాలు అనుమతుల కోసం డాక్యుమెంట్లు సమర్పించగా.. వాటిని గతంలో పరిశీలించిన ఐసీఎంఆర్ మరిన్ని వివరాలు సమర్పించాల్సిందిగా కొవిషీల్డ్, కొవ్యాక్సిన్ లను ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా తిరిగి అప్లై చేసిన వాటిని పరిశీలించిన ఐసీఎంఆర్ కొవ్యాక్సిన్ టీకాపై కీలక వ్యాఖ్యలు చేసింది..
ప్రపంచం కొవ్యాక్సిన్ వైపు చూస్తోంది..
భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా పై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. భారత్ లో ఇప్పటివరకు జరిగిన ప్రయోగ పరీక్షల ఫలితాలను బట్టి భద్రత, రోగనిరోధకత విషయంలో ఈ వ్యాక్సిన్ ఎంతో ప్రభావవంతంగా ఉందని తెలిపింది. ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్.. కొవాగ్జిన్ ప్రయోగ ఫలితాలను ప్రచురించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని 22 ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన మూడో దశ ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించింది.
Must Read ;- అసలు ‘కొత్త రకం’ అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది? అత్యంత ప్రమాదకరమా?

మూడోదశకు అనుమతులు ఇవ్వండి..
మరో దేశీయ వ్యాక్సిన్ జైడస్ క్యాడిలా మరో ముందడుగు వేసింది. రెండు దశలు క్లినికల్ ట్రయిల్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న ‘ZyCoV-D’.. మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. రెండు దశల ట్రయిల్స్ టీకా సురక్షణ, సామర్ధ్యం విషయాలలో అనుకున్న ఫలితాలు అందుకున్నట్లు సంస్థ ప్రకటించింది. మూడో దశ ట్రయిల్స్ లో భాగంగా 30 వేల వాలంటీర్లపై దేశ వ్యాప్తంగా ప్రయోగాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. భరతీయ డ్రగ్ కంట్రోలర్ నుంచి అనుమతులు లభించిన మరుక్షణమే మూడో దశ ట్రయిల్స్ ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.
తెలంగాణలో 9 యుకే ప్యాసెంజర్స్కి పాజిటివ్
కరోనా కేసులు కాస్త తగ్గాయిలే అనుకుంటున్న సందర్భంలో కొత్తరకం కరోనా గుబులు రేపుతోంది. లండన్ నుండి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టులోనే టెస్ట్ లు నిర్వహించాలని కేంద్రం, రాష్ట్రాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రకటను ముందు వచ్చిన వారిని వెతికి పట్టుకోవడంలో ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. డిసెంబర్ 9 నుండి నేటి వరకు హైదరాబాద్లో అడుగుపెట్టిన లండన్ ప్రయాణికుల్లో 1200 మందికి తెలంగాణ ప్రభుత్వ టెస్టులు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ అని తేలింది. అందులో అది కొత్తరకం కరోనా లేదా సాధారణమైనదా తెలుసుకోవడానికి వారి శాంపిల్స్ని పుణెకి పంపించారు. కొత్త రకం కరోనా కేసు గురించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారక ప్రకటన విడుదల కాలేదు.
మొదటి దశలో 5 లక్షల మందికి టీకా
తమిళనాడు ప్రభుత్వం మొదటి దశలో 5 లక్షల మందికి కరొనా టీకా అందించాలని నిర్ణయించింది. మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్స్, టెక్నిషియన్లకు ప్రధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. రెండు దశలో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్, పొలీస్.. అందరికీ టీకా అందించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు తమిళనాడు హెల్త్ డైరెక్టర్ సెల్వవినయగం ప్రకటించారు. అందుకోసం 13 వేల హెల్త్ సెంటర్ల నుండి సమాచారం సేకరించి, టీకా పంపిణీ ఎలా చేయాలనేది దానికి ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలిపారు హెల్త్ డైరెక్టర్.
Also Read ;- టీకా జాబితాలో మీ పేరు నమోదు చేసుకోవడం ఎలా?











