ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. సోమవారం, మంగళవారం రెండు రోజులపాటు జరగనున్న సమ్మెలో 10 లక్షలకు మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నట్లు యునైటెడ్ ఫొరం తెలిపింది. బ్యాంకులలో డిపాజిట్లు, విత్డ్రాయల్స్ , చెక్ క్లియరెన్స్, లోన్ అప్రూవల్స్ సహా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం అయ్యాయి.
బడ్జెట్ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులు సమ్మెకు పిలుపు ఇచ్చారు. కాగా, ప్రైవేటు బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, కోటక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్లు యధావిధిగా పనిచేశాయి.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదన్న నిర్మలా సీతారామన్.. రగిలిపోయిన కార్మిక సంఘాలు