దేశంలోని వాహనాల వివరాలు, డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు విదేశీ ప్రైవేటు సంస్థల చేతికి వెళ్లాయని, చాలా తక్కువ మొత్తానికి బీజేపీ ప్రభుత్వం ఈ వివరాలు పొందేందుకు అనుమతి ఇచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. 2019లోనే కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కాంగ్రెస్ ఎంపీ హుసేన్ దాల్వయ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిస్తూ దాదాపు రూ.65కోట్లకు ఈ వివరాలు పొందేందుకు అనుమతించామని, రూ.25 కోట్లకు వాహన యజమానుల వివరాలు, రూ.15కోట్లకు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు పొందేందుకు అనుమతించినట్టు చెప్పారు. చట్ట పరిధిలోనే ఈ అనుమతి ఉందని, గత ప్రభుత్వ హయాంలోనే ఈ అనుమతులు ఇచ్చారని వెల్లడించారు. ఇక్కడే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం చెప్పినంత వరకు బాగానే ఉన్నా సదరు ప్రైవేటు సంస్థల వద్ద డేటా ఎంత భద్రంగా ఉంటుందనేది సందేహాస్పదంగా మారింది.
Govt Sold Vehicles and Driving Licences Data :
చట్టభద్రమా లేక ప్రైవసీకి భంగమా?
ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటు వ్యక్తులకు చేరడం చట్టభద్రమా లేక ప్రైవసీకి భంగమా అనే చర్చ కూడా నడుస్తోంది. 2014 మార్చిలో జారీ చేసిన బల్క్ డేటా షేరింగ్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ డేటా వినియోగం ద్వారా రవాణా సౌకర్యాలు, భద్రత మెరుపడడడంతో పాటు వాహన తయారీ రంగానికి, రవాణా రంగానికి మేలు జరుగుతోందని, ఈ డేటా పంచుకునే సంస్థల అనుమతికి సంబంధించి పలు నిబంధనలు ఉన్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు.
అప్పజెప్పింది ఇలా..
కాగా 2014 సెప్టెంబరులో దేశంలో వాహన యజమానులు, లైసెన్సుల తదితర సమాచారం ప్రైవేటు సంస్థలతో పంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది.ఇందుకోసం ఫాస్ట్ లేన్ ఆటోమోటీవ్ ప్రైవేటు లిమిటెడ్ (FLA) కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.ఇప్పటికీ ఆ డేటా పంపిణీ కొనసాగుతోంది. NIC (National Informatics centre)నుంచి ఈ సమాచారం వెళ్తుండడంతో వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఒక్కో వాహనానికి 5పైసలకే..
కాగా FLAతోపాటు మరో కంపెనీ బిడ్డింగ్కు వచ్చినా.. FLA టెండర్ని దక్కించుకుంది. టోకున చూస్తే 5పైసలకు ఒక్కో వాహన వివరాలు ఇచ్చేశారని theWire.in పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. అదే సమయంలో కంపెనీ విలువ అమాంతం పెరిగిందని వెల్లడించింది. 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో డేటా షేరింగ్ పాలసీని తీసుకురాగా బీజేపీ ప్రభుత్వం వచ్చాక FLA ఈ టెండరును దక్కించుకుంది. ఈ టెండరు దక్కించుకోవడంతో కంపెనీ విలువ 333రెట్లు పెరిగిందని, దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వాహనాల వివరాలు ఆ కంపెనీకి చేరాయని కథనం ప్రబీజేపీ ప్రభుత్వం చురించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొడాలి శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఈ కథనాన్ని ప్రచురించింది. ఇక కంపెనీ విషయానికి వస్తే FLAలో 46శాతం బ్రిటీష్ కంపెనీలకు వాటా ఉందని తేల్చింది. FLAకు వాహనాల వివరాలు దక్కడం ద్వారా సదరు బ్రిటీషు కంపెనీలకు కూడా డేటా పంపిణీ జరుగుతోందనే కోణంలో కథనం ప్రచురించింది.
నిబంధనలను కాదని..
కాగా FLAతో జరిగిన ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు జాప్యం జరిగిన నేపథ్యంలో కేంద్ర గ్రేస్ పీరియడ్ను కూడా నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిందని, NIC అభ్యంతరాలు చెప్పినా.. తనకు ఉన్న అధికారం ద్వారా ఈ అనుమతి లభించిందని కథనంలో పేర్కొంది. ఇక ఈ ఒప్పందం కుదిరాక సదరు కంపెనీ ఓ జర్మన్ కంపెనీతో ఒప్పదం కుదుర్చుకుందని, డేటా షేరింగ్ జరిగిందని తేల్చింది. అయితే సదరు జర్మనీ కంపెనీ పొందిన వివరాలను తొలగించాలని కొందరు అధికారులు కోరగా ఆ కంపెనీ తిరస్కరించిందని కథనంలో పేర్కొంది.
రూ.వంద కోట్లు లక్ష్యంగా..
కాగా ఈ డేటా షేరింగ్పై వస్తున్న విమర్శల నేపథ్యంలో నితిన్ గడ్కరీ ఇటీవలే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాహనాల వివరాల షేరింగ్ కోసం ఏర్పాటైన వాహన్ అండ్ సారథి డేటా బేస్ ద్వారా రూ.100 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.గతంలో ఆదాయం తక్కువగా వచ్చేదని, అయితే బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆదాయం రూ.111కోట్లకు పెరిగిందన్నారు. ప్రైవేటు సంస్థలు రూ.3కోట్లతో, రూ.5కోట్లతో పరిశోధనా సంస్థలు ఈ వాహనాల వివరాలు పొందవచ్చని తెలిపారు. మొత్తం మీద దేశంలో ఉన్న దాదాపు 200 మిలియన్ల వాహనాల వివరాలు, 35కోట్లకుపైగా డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు ప్రైవేటు వారి చేతికి వెళ్లాయని చెప్పవచ్చు.
Must Read ;- స్పుత్నిక్ వచ్చేస్తోంది : అనుమతులకు కేంద్రం ఓకే











