Hero Nikhil Siddharth Tweet On Petrol Price Hike :
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి తప్ప.. అసలు తగ్గడం లేదు. అయితే పెట్రోల్ ధర పెంపు సామాన్యులకు కాదే.. సెలబ్రిటీలకు సైతం కోపం తెప్పిస్తోంది. పెట్రోల్ ధరలు సెంచరీ దాటిన నేపథ్యంలో హీరో నిఖిల్ ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. చమురు ధరలు ఇష్టారాజ్యంగా పెరుగుతున్నాయంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. సామాన్యులకు అందనంత ఎత్తులో పెట్రోల్ బంకులు చెట్టెక్కి కూర్చున్నాయంటూ ఓ వ్యంగ్యమైన ఫొటోను కూడా జతచేశారు.
”అసలేం జరుగుతోంది? 35 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్, డీజిల్ ధర.. రూ. 100 దాటేసింది. ఇంధన ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్స్ లను వెంటనే రద్దు చేయాలి. ప్రతిఒక్కరి తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి ఊహించని రెస్సాన్ వస్తోంది. ‘అసలైన హీరో నిఖిల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇతర హీరోలు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించాలని నెటిజన్స్ చాలామంది రీట్వీట్ చేస్తుండటం విశేషం.
Must Read ;- ఫ్యామిలీతో కోహ్లీ టూర్.. కూతురు వామిక పిక్స్ వైరల్!
Why Is this happening ?
35 rs Per litre Petrol / Diesel is Costing us 100 Rs plus at the Fuel Pump.
The Central & State Taxes on Fuel Must be reduced. 🙏🏽 Sincere Request on behalf of every person suffering from this. pic.twitter.com/1zAPEAJyRX— Nikhil Siddhartha (@actor_Nikhil) July 12, 2021











