దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కోట్లాది కుటుంబాల్లో ఆందోళన నెలకొనగా లక్షల మంది చనిపోయారు. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.రోజూ లక్షల కేసులు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.మోదీ ప్రభుత్వ చేతగాని తనం వల్లే దేశం ప్రమాదంలో పడిందని ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించింది.అయితే మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ కొంత కాలం క్రితం విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదే సమయంలో కాంగ్రెస్ ఆరోపణల్లో కొన్ని వాస్తవాలున్నాయని Factly.in వెబ్ సైట్లో ఉండడం బీజేపీపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ విడుదల చేసిన ఆ వీడియోను పరిశీలిస్తే..
ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన నోట్ల రద్దు
‘నోట్ల రద్దు దారుణంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది.జీఎస్టీ విధింపు కూడా దేశంపై ప్రతికూల ప్రభావం చూపింది. గరిష్టంగా 28 శాతం పన్ను విధించడంతో పలు రంగాలు దెబ్బతినాల్సి వచ్చింది.విధానాల్లో లోపాలు,నిర్ణయాల్లో అస్పష్టత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.ఇక చైనా చొరబాట్లను అడ్డుకోవడంలో విఫలం కావడం అదిపెద్ద వైఫల్యంగా మారింది.గత రెండేళ్లుగా భారత్-చైనా సరిహద్దు వివాదాలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే.సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు భారీ సంఖ్యలో మరణించారు.ఇక కొవిడ్ నియంత్రణ విషయంలో ప్రజలకు పిలుపునిచ్చి సరిపెట్టిన మోదీ కొవిడ్ను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోలేదు. పీపీఈ కిట్లు కూడా స్టాక్ లేని పరిస్థితి తలెత్తిందని,వైద్య ఆరోగ్య శాఖల పనితీరును మెరుగుపర్చడంలో విఫలమయ్యారు.కొవిడ్ వ్యాప్తి కారణంగా,ఆరోగ్య అత్యవసర పరిస్థితి,ఆర్థిక అత్యవసర తరహా పరిస్థితి తలెత్తిందని, లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి.
పెరిగిన పేదల సంఖ్య
యూపీఏ హయాంలో 2005 నుంచి 2015 మధ్య కాలంలో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య 270 మిలియన్లు ఉండగా గత ఏడాది మార్చి 2020 వరకు అంటే మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 2015-2020 మధ్యలో పేదరికంలో మగ్గుతున్నవారి సంఖ్య 400మిలియన్లకు చేరింది.నిరుద్యోగిత రేటు యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో 2శాతం నుంచి 4.9శాతం వరకు ఉండగా మోదీ హయాంలో 2015-2020 మధ్యలో అది 11శాతానికి చేరింది.యూపీఏ హయాంలో జీడీపీ సగటు 7.75-8.9 శాతం మధ్యలో ఉండగా మోదీ హయాంలో ప్రస్తుతం మైనస్ -3.1నుంచి మైనస్-7.3కి దిగజారింది.2015 తరువాత మోదీ ప్రభుత్వ హయాంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.పలు రాష్ట్రాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు సెంచరీకి దగ్గర అవుతున్నాయి.చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉంది.అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టిన సమయంలోనూ దేశంలో ఇందన ధరలు తగ్గించలేదు. సామాన్యుడిపై భారాన్ని మోపింది.
Must Read ;- మోడీని ఉతికి ఆరేసిన మీడియా : ట్రెండింగ్ లో ‘రిజైన్ పీఎం మోడీ’
నిత్యావసరాల ధరల విషయానికి వస్తే..
ఇక నిత్యావసరాల ధరల విషయానికి వస్తే బియ్యం ధర సగటున రూ.27.5గా ఉండగా మోదీ హయాంలో 24శాతం పెరిగింది. 2020 నాటికి గోధుమల ధరలూ 33.76శాతం పెరిగాయి.పాల ధర 29.38శాతం పెరిగింది.ఆలు ధర 49శాతం పెరిగింది.మొత్తం మీద ఇతర నిత్యావసరాల ధరలూ 27శాతం నుంచి 67శాతం వరకు పెరిగాయి.కొవిడ్ నుంచి,చైనా చొరబాట్ల నుంచి మోదీ దేశాన్ని రక్షించలేకపోయారు.అదే సమయంలో ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారత్లో మోదీ హయాంలో ప్రజాస్వామ్య విలువలను గాలికొదిలేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వ్యవస్థలను,ఎన్నికల ప్రక్రియలను విఫలం చేశారు.రాజకీయ అధికారం సుపరిపాలకు మార్గం కాలేకపోయింది.వెరసి దేశం ప్రమాదంలో పడింది.’ అనే వీడియోను గతంలో కాంగ్రెస్ విడుదల చేసింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ లీ చెక్ ఇదీ..
ఇక కాంగ్రెస్ ఆరోపించిన కొన్ని అంశాలపై ఫ్యాక్ట్ లీ నివేదికను పరిశీలిస్తే జీడీపీ విషయంలో పాక్షిక వివరాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ పేర్కొందని తేల్చింది.2018-19లో జీడీపీ అంతకు ముందు సంవత్సరంతో పోల్చినప్పుడు 8శాతం ఉందని తెలిపింది. ఈ పోలిక ఏ ప్రాతిపాదికన చేశారో క్లారిటీ లేదని వెబ్ సైట్ లో పేర్కొంది.
Factly: https://factly.in/fact-check-how-true-are-congress-partys-claims-about-exports-growth-unemployment-rate-and-other-things/
ఇక నిరుద్యోగిత విషయానికి వస్తే కాంగ్రెస్ ఆరోపణల్లో కొంత వాస్తవం ఉందని తేల్చింది.కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టు నిరుద్యోగిత శాతం 7.9గా లేదని, 6.1గా ఉందని తేల్చింది.అదే సమయంలో యూపీఏ హయాంలో నిరుద్యోగిత రేటు 2.2శాతం ఉందని చెప్పింది.ముంబైకి చెందిన సంస్థ సర్వే ప్రకారం ఈ లెక్కలు ఉన్నాయని చెప్పింది.ఎగుమతుల విషయంలోనూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో పాక్షిక వాస్తవం ఉందని,ఆటోమొబైల్ విక్రయాల విషయంలో యూపీఏ ప్రభుత్వ హయాంతో పోల్చితే ఎన్డీయే హయాంలో 36శాతం తగ్గిందన్న ఆరోపణలపై ఇంకా పరిశీలించాల్సి ఉందని,పూర్తి సమాచారం బయటకు రావాల్సి ఉందని పేర్కొంది.అయితే యువతపై ఎక్కవగా ప్రభావితం చూపే నిరుద్యోగిత రేటు పెరగడం,సామాన్యుడిపై ప్రభావం చూపే నిత్యావసరాల ధరలు, చమురు ధరలు పెరగడంతో సాధారణంగానే ప్రభుత్వాలపై వ్యతిరేకత వస్తుంది.ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వంపై సాధారణంగానే వ్యతిరేకత రావడానికి తోడు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కచ్చితంగా బీజేపీపై మరింత ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు.
ALso Read ;- బీజేపీకి షాక్.. పెద్దవి పోయి,చిన్నవి మిగిలి..!










