పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ ప్రారంభమైంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మరో విశేషమేమిటంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే, డైలాగులు రాస్తున్నారు. ఈరోజు ఉదయమ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
మొదటగా ఇక్కడ వేసిన సెట్ లో ఓ ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. మంగళవారం నుంచి పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరతగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. దాదాపు హైదరాబాద్ లోనే వేసిన సెట్ లో షూటింగ్ జరపాలని నిర్ణయించారు. ఇందులో పవన్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవి, రానా సరసన ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. రానా తండ్రిగా సముద్రఖని నటించబోతున్నట్లు సమాచారం. మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలను పోషించబోతున్నారు.
Must Read ;- పవన్ మరో దర్శకుడికి ఓకే చెప్పారా? ఎవరా డైరెక్టర్?











