ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది సమీరా రెడ్డి . చిరంజీవి ‘జై చిరంజీవ’ తో సమీరా రెడ్డికి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఎన్ఠీఆర్ సరసన ‘నరసింహుడు, అశోక్’, సూర్యతో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ లాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. కానీ పెళ్ళయ్యాక సమీరా రెడ్డి పూర్తిగా సినిమాలను దూరం పెట్టేసింది. అనేకమంది దర్శకనిర్మాతలు మంచి ఆఫర్స్ ఇచ్చినా నో చెప్పింది.
తన వ్యక్తిగత జీవితానికే సమీరా ఎక్కువ సమయం కేటాయించి సినిమా ఆఫర్లను వదులుకుంది. అయితే తాజాగా సమీరా రెడ్డి సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్నట్టు కోలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొట్టింది. తమిళంలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విశాల్, ఆర్య కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో సమీరా రెడ్డి ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోందని పుకార్లు షికార్లు చేసాయి. చివరికి ఈ వార్తలు సమీరా రెడ్డి వద్దకు చేరాయి. దీంతో స్పందించిన సమీరా రెడ్డి తన రీఎంట్రీపై పక్కాగా క్లారిటీ ఇచ్చేసింది.
ఇప్పట్లో తనకు సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని, ఇప్పుడు ఆమె దృష్టంతా తన పిల్లల భవిష్యత్ మీదే ఉందని సమీరా తెలిపింది. తన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే కావడంతో వారికి తన అవసరం ఎంతో ఉందని, కాబట్టి సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు సమీరా. అందరూ అంటున్నట్టు విశాల్, ఆర్యలు సినిమాల్లో తాను నటించడంలేదని కుండ బద్దలు కొట్టారు సమీరా. ఒకవేళ ఎప్పుడైనా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే తప్పకుండా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు తెలియచేస్తానని తెలిపింది సమీరా. ఆమె స్పందనతో రూమర్లకు కాస్త చెక్ పడింది. మున్ముందు సమీరా రెడ్డి సినిమాల్లో రీఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి మరి.










