కూడు.. గూడు.. గుడ్డ.. ఈ మూడు మనిషికి ప్రాథమిక అవసరం. ఈ మూడింట్లో ఏ ఒక్కటి లేకున్నా జీవనం దుర్భరమే అని చెప్పాలి. సొంతిల్లు ప్రతిఒక్కరి కల. అందుకోసం ఎంతకైనా ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ప్రభుత్వాలు సైతం పేదొడికి సొంతింటి కలను నెరవేర్చుందుకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఆదుకునే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో పేదోళ్లకు సొంతింటి కల కలగానే మిగిలిపోనుంది. పేదల కోసం వైసీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’లను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 15,60,227 నిర్మాణానికి మొదటి దశలో రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది. అయితే పొలాలు, గుట్టలు, చెరువుల దగ్గర, ఊరి శివారులో స్థలాలను కేటాయించింది. చిన్నపాటి వర్షాలకే కాలనీలు నీట మునిగిపోతున్నాయి. కొన్నిచోట్లా ఏకంగా చెరువులను తలపిస్తున్నాయి.
పేదలపై తీవ్ర భారం
గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. సరైన సమయంలో ఇల్లు నిర్మించుకోకుంటే స్థలాలను వెనక్కి తీసుకుంటామని అధికారులు హెచ్చరించడంతో కొంతమంది పేదలు లోతట్టు ప్రాంతాల్లోనే నిర్మాణాలకు సిద్దమయ్యారు. తీరా వర్షాలు పడటంతో అవన్నీ బురద కుంటలుగా దర్శనమిస్తున్నాయి. తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కాలనీల లే అవుట్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల నిర్మాణాలకు కనీసం నీరు కూడా అందించడం లేదనే విమర్శలున్నాయి. నీళ్ల సమస్య వేధిస్తుండటంతో పేదల నీళ్లను కొని ఇళ్ల నిర్మాణానికి పూనుకుంటున్నారు. ఇప్పటికే ఆర్థిక భారంతో జీవితాలు వెళ్లదీస్తున్న పేదలకు జగనన్న కాలనీలు తీవ్ర భారంగా మారాయని చెప్పక తప్పదు.
శోభనానికి కూడా పనికిరావు
శోభనానికి కూడా ఈ ఇళ్లల్లోని బెడ్రూమ్ శోభనానికి కూడా చాలదంటూ సొంత పార్టీకే చెందిన శాసన సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. వైసీసీ రెబల్ ఎంపీ రఘురామరాజు సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. ఏళ్ల తరబడి నిలిచి ఉండేలా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులను కల్పించడానికి, ఇళ్ల నిర్మాణానికి ప్రజల నుంచి కూడా కొంత నిధులను సమీకరించాలని, దీనికి లబ్దిదారులు కూడా సహకరిస్తారని రఘరామరాజు ప్రభుత్వానికి సూచించారు.
Must Read ;- జగన్రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో దళితులకు బతికే హక్కులేదా?