తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ ఈటలతో భేటీ అయ్యారు. రాజకీయ భవిష్యత్పై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈటలను సీఎం కేసీఆర్ మంత్రి పదవి నుంచి తొలిగించిన తర్వాత పలువురు నేతలు ఆయను కలుస్తున్నారు. ఈటల మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా ఈటల పట్టు బిగిస్తుండటంతో అధికార పార్టీ ప్రలోభాలకు నాంది పలికిందనే వార్తలు కూడా వినవస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలపై, ప్రజా ప్రతినిధులపైన దాడులు చేస్తున్నారని ఈటల రాజేందర్ పలు సార్లు వ్యాఖ్యలు చేశారు. ఈటలను దెబ్బకొట్టేందుకు.. స్థానిక నాయకులను ఆయనకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈటల ఎలా స్పందిస్తారు? ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు? ఏ నిర్ణయం తీసుకోబుతున్నారో అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.
Must Read ;- కాంగ్రెస్ లోకి రండి : ఈటలకు బట్టి విక్రమార్క ఆఫర్.. ఈటల ఏమన్నారంటే..