Lena Maria Paul The Malayalam Actress Who Cheated The Businessman Was Arrested In Ed Case :
మోసాల్లో పలు రకాలు. కొన్నింటిని వాటి స్థాయిని బట్టి చిన్న మోసాలుగా పేర్కొంటే.. వందల కోట్ల మేర డబ్బుతో కూడిన మోసాలు పెద్దవి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మోసం మామూలు మోసం కాదు. మోసానికే మహా మోసం లాంటిది. ఎందుకంటే.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అంటేనే.. అటు బడా వ్యాపారవేత్తలతో పాటు అటు దేశముదురు రాజకీయ నేతలు కూడా హడలిపోతారు. ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు ఈడీ కేసులను తర్వాత విచారణ చేయండి అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైనమే ఇందుకు నిదర్శనం. ఈడీ నమోదు చేసిన ఓ కేసులో అరెస్టైన ఓ వ్యాపారవేత్తకు ఏకంగా బెయిల్ ఇప్పిస్తామంటూ ఓ సినీ నటి నమ్మబలికింది. మరో వ్యక్తితో కలిసి ఏకంగా ఆ వ్యాపారి కుటుంబం నుంచి ఏకంగా రూ.200 కోట్లు దండుకుంది. ఈడీ కేసులంటే మామూలువి కాదుగా. బెయిల్ అంత త్వరగా రాదు కదా. ఈ విషయం అంతగా తెలియని వ్యాపారవేత్త కుటుంబం ఆ నటి చెప్పిన మాటలు ముందుగా నమ్మినా.. కాలం గడిచిపోతున్నా.. బెయిల్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా మహా మోసానికి పాల్పడ్డ ఆ అందాల నటి ఇప్పుడు అరెస్టైపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఈ కేసు వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
కేసు ఏమిటంటే..?
ఫోర్టిస్ కంపెనీ ప్రమోటర్లలో శివింద్ సింగ్ ఒకరు. ఆ కంపెనీల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదులతో ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా శివిందర్ అక్రమాలకు పాల్పడ్డట్టుగా తేల్చింది. ఇంకేముంది.. అప్పటికే ఫోర్టిస్ నుంచి తప్పుకున్నప్పటికీ శివిందర్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కేసు దర్యాప్తు అంతకంతకూ సాగుతూనే ఉన్న నేపథ్యంలో శివిందర్ కు బెయిల్ రావడం సాధ్యం కాలేదు. అప్పటికే శివిందర్ కు బెయిల్ ఇప్పించేందు కోసం ఆయన ఫ్యామిలీ తనదైన శైలిలో యత్నించింది. కోర్టులనూ ఆశ్రయించింది. అయినా బెయిల్ దొరికే ఛాన్స్ కనిపించలేదు. దీంతో శివిందర్ కు బెయిల్ దక్కే మార్గాలేమున్నాయన్న కోణంలో ఆయన సతీమణి అదితి సింగ్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టారు. అప్పుడే ఆమెకు మళయాళ నటి లీనా మారియా పాల్ తో పాటు సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిచయమయ్యారు.
ఈడీతోనే బెయిలిప్పిస్తుందట
అప్పటికే శివిందర్ బెయిల్ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ యత్నించిన అదితి సింగ్.. ఏ చిన్న అవకాశం చిక్కినా వదలకూడదని భావించారు. ఇదే విషయాన్ని గుర్తించిన లీనా మారియా పాల్, సుకేశ్ చంద్రశేఖర్ లు.. తాము శివిందర్ కు బెయిల్ ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ దిశగా అదితి సింగ్ కు వారిద్దరూ ఏం చెప్పారో తెలియదు గానీ.. వారి మాటలను ఆమె బాగానే నమ్మింది. అడిగిన మేరకు డబ్బు అందించేందుకు కూడా అదితి ఒప్పుకున్నారు. ఈ క్రమంలో అదితి నుంచి ఏకంగా రూ.200 కోట్లను లాగేసుకున్న పాల్, సుకేశ్ లు.. ఎంచక్కా ఢిల్లీ టూ తిరువనంతపురం చక్కర్లు కొడుతూనే ఉన్నారు. రూ.200 కోట్లు ఇచ్చినా శివిందర్ కు ఇంకా బెయిల్ రాకపోవడంతో అదితికి అనుమానం వచ్చింది. అంతేకాకుండా ఈడీ అధికారులు ఎంత కఠినంగా ఉంటారో కూడా తెలుసుకుంది. ఇంకేముంది తనను పాల్, సుకేశ్ లు మోసం చేశారని గ్రహించి వారిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లీనా మారియా పాల్ ను సోమవారం ఢిల్లీలోనే అరెస్ట్ చేశారు.
Must Read ;- ఏడు గంటల పాటు రకుల్ విచారణ











