టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఎపీ మాజీ సీఎం చంద్రబాబు మనవడు, సినీ నటుడు బాలకృష్ణ మనవళ్లకు ఈ రోజు బాసర సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, పెద్ద కుమార్తె బ్రాహ్మిణి, రెండో కుమార్తె తేజస్విని ఇతర బంధువులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా లోకేష్, బ్రాహ్మిణి దంపతుల కుమారుడు దేవాన్ష్, బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కుమారుడు ఆర్యన్లతో సరస్వతీదేవి సన్నిధిలో అక్షరాలు దిద్దించారు. కాగా 2017లోనే చంద్రబాబు దంపతులు నారా దేవాన్ష్కు తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు
.Must Read ;- ఎన్టీఆర్ అమర్ రహే!: ముత్తాతకు మునిమనవడి శ్రద్ధాంజలి