ఏపీ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా చేసిన అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎర్రచందనం నరికేస్తున్నట్టే మంత్రి పెద్దిరెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేస్తున్నాడని నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా నుంచి 2000 కోట్ల ఎర్ర చందనం స్మగ్లింగ్ చేశాడని లోకేష్ ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బయట ప్రాంతాల నుంచి 2 లక్షల మందిని తీసుకు వచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
5 వేల మంది మకాం..
తిరుపతిలోని పీఎల్ఆర్ కళ్యాణ మండపంలో దొంగఓట్లు వేసేందుకు వచ్చిన 5 వేల మంది మకాం వేశారని నారా లోకేష్ చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్, మరికొన్ని ప్రాంతాల్లో దొంగఓట్లు వేయడం ద్వారా తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలు గెలవాలని చూస్తున్నారని లోకేష్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్లో మంత్రులు రెచ్చిపోతున్నారని, ఈసీ ఇప్పటికైనా వారిని అదుపులోకి తీసుకోవాలని లోకేష్ విజ్ఙప్తి చేశారు.
Must Read ;- వైసీపీ ప్యాక్షన్ రాళ్లు ఆయన్ను భయపెట్టలేవు.. నారా లోకేష్











