యూనివర్సల్ అపీల్ కలిగిన కథలతో .. సందేశాత్మక రీతిలో సినిమాలు తీయడం దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకం. అదే సమయంలో ఆ మూవీస్ తో కమర్షియల్ గానూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టడం కూడా ఆయన టాలెంట్. ఆ ప్రాసెస్ లో కెరీర్ బిగినింగ్ నుంచీ ఆయన తన సినిమాల్లో పరాయి భాషల్లోని ప్రముఖ నటుల్ని ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు.
‘మిర్చి’లో సత్యరాజ్, జనతాగ్యారేజ్ లో మోహన్ లాల్, భరత్ అనే నేను లో శరత్ కుమార్ ను ఎంపిక చేసిన కొరటాల .. ఇప్పుడు ఆచార్య కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు యన్టీఆర్ 30 కోసం మరో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని రంగంలోకి దింపబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఒక సామన్యుడు అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్నే శాసించడం ఈ సినిమా కథాంశం. దీని ప్రకారం ఇందులో యన్టీఆర్ కి గాడ్ ఫాదర్ లాంటి పాత్రను మమ్ముట్టి పోషించబోతున్నారని తెలుస్తోంది.
మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. 1921 అనే డబ్బింగ్ సినిమాతో తొలి సారిగా తెలుగు ఆడియన్స్ కు దగ్గరయిన ఆయన ఆ తర్వాత ‘సామ్రాజ్యం, దళపతి’, ప్రియురాలు పిలిచింది.. లాంటి ఎన్నో డబ్బింగ్ సినిమాలతోనూ ఆకట్టుకున్నారు. ఇక ‘స్వాతికిరణం, రైల్వే కూలి, సూర్య పుత్రులు’ అనే స్ట్రైట్ మూవీస్ తో మెప్పించారు. మొన్నామధ్య ‘యాత్ర’ సినిమాలో వైయస్సార్ పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి మమ్ముట్టి ఇప్పడు యన్టీఆర్ కొరటాల శివ సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతుండడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో చూడాలి.
Must Read ;- కొరటాల శివకి షాకిచ్చిన రౌడీ హీరో?