మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల్ని ఎంతగా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అనారోగ్యం బారిన పడి.. ఆర్ధికంగా బాధపడే ఎందరికో ఆయన సహాయం చేశారు. అంతేకాదు ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎందరో లబ్ధి పొందుతున్నారు. రీసెంట్ గా చిరు ఒకరికి లక్షరూపాయలు ఆర్ధిక సహాయం చేసి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. కడపకు చెందిన పి.సురేష్ అనే వ్యక్తి అనారోగ్యం పాలైతే.. వెంటనే స్పందించిన చిరంజీవి అతడికి వెంటనే లక్షరూపాయల చెక్ పంపించారు.
పి.సురేశ్ కు చిరంజీవి వీరాభిమానిగా ఎంతో పేరు. కడపజిల్లా చిరంజీవి అభిమాన సంఘం మాజీ అధ్యక్షుడిగా ఎనలేని సేవలు అందించాడు. చిరును ఎంతగానో అభిమానించే అతడు .. ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ప్రస్తుతం అనారోగ్యం పాలైన అతడు కదిరిలో ఉంటున్నాడు. చికిత్స నిమిత్తం ప్రతి రెండురోజులకు ఒకసారి కదిరి నుంచి కడప, తిరుపతి వెళ్లివస్తున్నాడు. దాంతో ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతోన్న సురేష్ కు చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షరూపాయలు చెక్ అందచేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
Must Read ;- చిరంజీవి తీసుకున్న కేర్ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను