తెలంగాణలో జాబ్ నోటిఫికెషన్లు వెలువడకపోతుండటంతో నిరుద్యోగులు ఆత్యహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతున్నాయి. నిరుద్యోగులకు అండగా నిలబడాల్సిన నేతలే, వాళ్లపై మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగభృతి హామీ ఏమైందని ప్రశ్నించిన పాపానికి తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ‘నీ అంతు చూస్తానని’ బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అనుముల మండలం కొత్తపల్లిలో మంగళవారం మంత్రి మాట్లాడుతుండగా వాహనం వద్దకు అదే గ్రామానికి చెందిన నిరుద్యోగి అలుగుల అశోక్రెడ్డి వచ్చాడు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించగా, ‘నిన్ను, నీ నాయకుణ్ని తొక్కిపడేస్తా. నీలాంటి కుక్కలను చాలా మందిని చూశా’ అని మంత్రి హెచ్చరించారు.
Must Read ;- హామీలు నెరవేరిస్తేనే సాగర్ లో కేసీఆర్ అడుగుపెట్టాలి : ఎంపీ రేవంత్ రెడ్డి











