నటుడు, నిర్మాత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా బండ్ల గణేశ్ అందరికీ సుపరిచితుడే. పవన్ పై ఆయన ఇచ్చే స్పీచెస్ అంటే.. అభిమానులకు భలే ఆసక్తి. ఇటీవల వకీల్ సాబ్.. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ స్పీచే బాగా ట్రెండ్ అయింది. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ.. ఆయన చేసిన సంబోధన ఓ రేంజ్ లో సర్క్యులేట్ అయింది. పవన్ కళ్యాణ్ తనకి వ్యసనం అని ఎప్పడూ చెప్పే .. బండ్ల ఇప్పుడు ఐసీయూలో చేరారని సమాచారం.
హైద్రాబాబ్ జూబ్లీ హిల్స్ లోని ఒక హాస్పిటల్ లో బండ్ల గణేశ్ చేరారట. కారణం ఆయనకి మరోసారి కరోనా పాజటివ్ రావడమేనట. గతంలో ఓ సారి కోవిడ్ బారిన పడ్డ గణేశ్.. మెరుగైన చికిత్స తో కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మళ్ళీ కరోనా పాజిటివ్ రావడంతో.. ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించిందట. వెంటనే ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారట. ఇటీవల ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బండ్ల డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన శరీరం ట్రీట్ మెంట్ కు సహకరిస్తోందని వారు చెబుతున్నారు.
Must Read ;- నీ బండ్ల బడా.. ఇదేం భజన సామీ











