ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ అత్యధికంగా ఇష్టపడే గేమ్ ఏదైనా ఉందంటే.. అది క్రికెట్ అని చెప్పాలి. ఇతర ఆటలు ఇవ్వలేని థ్రిల్స్ క్రికెట్ ఇస్తుంది కాబట్టి.. చాలామంది ఈ గేమ్ అంటే చెవికొసుకుంటారు. ఇండియాలో పదిమందిలో కనీసం ఒక్కరైనా క్రికెట్ ను ఇష్టపడనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. అభిమాన ఆటగాడు సిక్స్ కొడితే.. తామే కొట్టినట్టు ఫీల్ అవుతారు. ప్రత్యర్థి వికెట్ పడగొడితే గ్రౌండ్ లో రచ్చ రచ్చ చేస్తారు. ఇక పొట్టి క్రికెట్ టీ20 అయితే.. అభిమానుల ఆనందానికే హద్దే ఉండదు. ఇంతగా ఎంటర్ టైన్ చేస్తుంది కాబట్టే భారత ప్రేక్షుకులు క్రికెట్ ఒక మతంగా, సచిన్, విరాట్, ధోని లాంటివాళ్లను దేవుళ్లగా భావిస్తారు. తాజాగా మహిళ క్రికెట్ లో లో మిథాలీ రాజ్.. అత్యధిక పరుగులు సాధించడంలో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు, రికార్డులు, పరుగులు నమోదు చేసిన జట్టు ఏదైనా ఉందంటే.. అది ఇండియా అనే చెప్పాలి.
ఇద్దరూ.. ఇద్దరే!
ప్రపంచవ్యాస్తంగా క్రికెట్ అనగానే అన్ని దేశాలకు ఇండియాను గుర్తుకువస్తోంది. భారత పురుషులు, మహిళలు జట్టు సాధిస్తున్న విజయాలే అందుకు కారణం. ఇప్పటికే క్రికెట్ గాడ్ గా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్ పై చెరగని ముద్ర వేశారు. 1989లో భారతజట్టు తరపున అరంగేట్రం చేసిన సచిన్.. 2013లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. 200 టెస్టులు, 463 వన్డేలు ఆడిన 34 వేలకుపైగా పరుగులను తన ఖాతాలో వేసుకున్నారు. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తను వైదొలిగి ఇప్పటికి ఏడేళ్లు అయినా.. తన రికార్డులు కొన్ని చెక్కు చెదరలేదు. ఇప్పటికీ వన్డేల్లో అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డు సచిన్ పేరిటే ఉంది. భారత మహిళల క్రికెట్ లో ఓ ఐదేళ్లు ఆడితేనే గొప్ప.. మరి అలాంటిది మిథాలీ రాజ్ ఏకంగా పదిహేను సంవత్సరాలుగా ఆడుతూనే ఉంది. నేటికీ తన ఆటతీరుతో అలరిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. స్టార్ క్రికెటర్లు సచిన్, కోహ్లీ, ధోని లాంటివాళ్లకు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తోంది. తాజాగా ఆమె క్రియేట్ చేసిన రికార్డే అందుకు ఎగ్జాంపుల్. తాజాగా ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో మిథాలీ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు (10,337) చేసిన బ్యాట్స్ ఉమెన్ గా సరికొత్త రికార్డును సాధించారు.
రన్స్ మిషన్స్
భారత జట్టు అనగానే ఎంతోమంది టాలెంటెడ్ ఆటగాళ్లు గుర్తుకొస్తారు. కపిల్ దేవ్, గవాస్కర్, గంగూలీ, సచిన్, యువరాజ్, ధోని, కోహ్లీ, విరాట్, సెహ్వావ్, రోహిత్ శర్మ లాంటి భారత పురుషుల జట్టుపై తమదైన ముద్ర వేస్తే.. ఇక మహిళల జట్టులో మిథాలీ రాజ్, మంథాన, హర్మన్ ప్రీత్, షెపాలీ వర్మ లాంటివాళ్లు ప్రపంచ క్రికెట్ ను ప్రభావితం చేస్తున్నారు. అందుకే ఇండియా 2 ప్రపంచ వరల్డ్ కప్ లు, 1 ట్వీ20 వరల్డ్, మరెన్నో ఐసీఐసీఐ ట్రోఫీలు సొంతం చేసుకొని ప్రపంచ క్రికెట్ లో ఎన్నో సంచనాలను నమోదు చేసింది. 463 వన్డేల్లో 96 హాఫ్ సెంచరీలు, 49 సెంచరీల 18,426 పరుగులు సచిన్ నమోదు చేయగా.. మహిళల క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ (10,337) చేశారు. ఇక కెప్టెన్ కోహ్లీ కేవలం 205 ఇన్నింగ్స్ ఆడి పదివేల మార్కును అందుకున్నారు. ఇలా అద్భుత విజయాలు నమోదు చేస్తూ.. ప్రపంచ క్రికెట్ పై చెరగని ముద్ర వేస్తున్నారు.
Must Read ;- డబ్ల్యూటీసీ ఫైనల్ కు వర్షం దెబ్బ.. నిరాశలో అభిమానులు