హైదరాబాద్ గోవుల వ్యవహారం హద్దులు దాటుతుంది. గోవుల తరలింపులో పోలీసుల హ్యండ్ ఉందంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బిజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గోవుల వ్యవహారంలో ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసి, అందులో పోలీసులు గోవులు తరలించడానికి సహకరిస్తున్నారంటూ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది.
దీనిపై స్పందించిన సిపి సజ్జనార్ పోలీసులపై ఇలాంటి ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరుపడితే వారు మీడియాలో పోలిసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలీసులపై ఇష్టం వచ్చినట్లు నిందలు వేయడం ఫ్యాషనైపోయిందన్నారు సజ్జనార్. గోవుల తరలింపై ఎవరైనా డబ్బులు తీసుకుని ఉంటే ఫిర్యాదు ఇస్తే చర్యలు చేపడతామని, ఒకవేళ ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, అప్పుడు కూడా చర్యలు చేపట్టకపోతే అప్పుడు ఆరోపించాలన్నారు సజ్జనార్.
ఎమ్మెల్యే రాజాసింగ్కి మద్దతుగా నిలిచారు బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తాము అందరి పోలీసులను అనడం లేదని, కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. అవార్డులు, రివార్డులకు ఆశపడి టిఆర్ఎస్ ప్రభుత్వానికి సహరిస్తున్నారని ఆరోపించారు.
Must Read ;- జాతీయ ప్రాణిగా గోవును గుర్తించాలి:నటుడు సుమన్