వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కుంభకోణంలో దేశం విడిచి వెళ్లి పోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అదృశ్యమయ్యారు.అంటిగ్వా దీవిలో ఉంటున్న చోక్సీ అదృశ్యమైనట్లు ఆయన లాయర్ విజయ్ అగర్వాల్ వెల్లడించారు.అక్కడి రెస్టారెంట్లో నిన్నసాయంత్రం విందు కోసం వెళ్ళిన ఆయన తర్వాత కనిపించకుండా పోయారు.ఆయన వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంటిగ్వా పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు.నీరవ్ మోదీకి మెహుల్ చోక్సీ మేనమామ అవుతారు. 2018లో పీఎన్బీ కుంభకోణం బయటపడటంతో వీళ్ళిద్దరూ దేశం విడిచి వెళ్ళిపోయారు.ప్రస్తుతం యూకేలో ఉంటున్న నీరవ్ మోదీని, అంటిగ్వాలో ఉంటున్న మెహుల్ చోక్సీని భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ నేపథ్యంలో చోక్సీ అదృశ్యం కావడం గమనార్హం.
Must Read ;- అమిత్ షా గుట్టు తెలిసిన IPS.. ఇప్పుడు ఆ రాష్ట్ర DGP