పీఎన్బీ నుంచి 14 వేల కోట్ల రూపాయలు రుణం పొంది లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్కు అప్పగించనున్నట్లు యూకే కోర్టు తీర్పు వెల్లడించింది. బోగస్ కంపెనీలతో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు భారత్ మోపిన అభియాగాలన్నీ సబబే అని కోర్టు పేర్కొంది. బ్యాంకుల ఉన్నతాధికారులతో ఆయనకు లింకులు ఉన్నాయన్నట్లు ధృవీకరణ అయినట్లు తెలిపింది. నీరవ్ మానసిక స్థితి బాగా లేదని, ముంబయి ఆర్తూర్ జైలులో బ్యారక్ 12 ఆయనకు తగినది కాదన్న నీరవ్ న్యాయవాది వాదనలను జడ్డి తోసిపుచ్చారు. ఆ జైలులో ఆయన మానసిక స్థితికి వైద్యం అందించేందుకు తగిన సదుపాయాలున్నాయన్నారు. ఈ కేసును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రభావితం చేస్తున్నారన్న నీరవ్ న్యాయవాది వాదనలను జడ్డి అంగీకరించలేదు. దీంతో ఎంతోకాలం నుంచి నీరవ్ మోడీని భారత్ తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు మార్గం సుగుమమయ్యింది.
Must Read ;- చందా కొచ్చర్కు బెయిల్ మంజూరు..