వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు వరుసగా జగన్ సర్కార్ కు షాక్ లు ఇస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై లేఖలు సంధిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ప్రధాన హామీలను గుర్తుచేసిన రఘురామరాజు.. తాజాగా మరో లేఖ రాశారు. ‘నవ ప్రభుత్వ కర్తవ్యాల’ పేరుతో లేఖ రాశారు. రాష్ట్రంలో విధించిన వివిధ పన్నులపై రఘురామ లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఆస్తి, చెత్తపై పన్నులు విధిస్తుండటంతో ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. ప్రజలపై భారం పడకుండా వైసీపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.
వైఎస్సార్ ఆశయాలకు విరుద్ధంగా..
సీఎం జగన్ రెడ్డి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రఘురామరాజు ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో ఉచిత పథకాలను అందించారని, సీఎం జగన్ మాత్రం రైతులను నిర్లక్ష్యం చేస్తూ ఎడాపెడా వ్యవసాయ బిల్లులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ సర్కార్ పన్ను విధింపు వల్ల ప్రతి పేద కుటుంబం ఆదనంగా పది వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పేదలపై పన్నుల భారం తగ్గించేందుకు ఏమాత్రం చర్యలు తీసుకోవడం స్పష్టం చేశారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడటంతో.. ప్రజలు జగన్ కు ఓట్లు వేశారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఒక చేతితో ఇచ్చి.. మరో చేతితో లాగేసుకుంటున్నారని రఘరామరాజు మండిపడ్డారు.
Must Read ;- చిక్కుల్లో జగన్.. వైసీపీ వర్గాల్లో టెన్షన్!