దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు కూడా ఫేక్ అఫిడవిట్ సమర్పించి మరోసారి ఫేక్ సీఎం అనే పేరుని జగన్రెడ్డి సార్థకం చేసుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ రోజు సుప్రీంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఎలాంటి ప్రణాళిక లేని అఫిడవిట్ సమర్పించి చివాట్లు తిన్నారన్నారు. వారు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం పరీక్షల నిర్వహణకు 35 వేల క్లాస్ రూమ్స్ ,అందుకు తగ్గట్టుగా సిబ్బంది ఉండాలని. వీటన్నింటికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందా అని ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాల రక్షణకు, పరీక్షల నిర్వహణకు కనీస ఏర్పాట్లు కూడా చేయకుండానే మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని సుప్రీం కోర్టు ప్రశ్నించడం జగన్రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట అని ఆయన అన్నారు.
విద్యార్థికి ప్రాణహాని జరిగితే కోటి కడతారా..
పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే పోయే ఒక్కో ప్రాణానికి కోటి రూపాయిలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోర్టు వ్యాఖ్యానించడం చూస్తే ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదనే విషయం బయటపడిందని తెలిపారు. ఇప్పటికైనా చేసిన తప్పుని సరిదిద్దుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాణాలు బలితీసుకునే పరీక్షల నిర్వహణ ఆలోచనకి స్వస్తి పలకాలని హితవుపలికారు. తక్షణమే పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని సుప్రీం కోర్టుకి తెలపాలని లోకేష్ డిమాండ్ చేశారు.
ఈ టైములో పరీక్షల నిర్వహణ తగదంటూ..
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలంటూ లోకేష్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు, పరీక్షల నిర్వహణఫై విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ వర్గాల నుంచి జూమ్ సమావేశాల్లో అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. అయినా ప్రభుత్వం మొండి పట్టుదలతో పరీక్షలు నిర్వహిస్తామనటంతో కొంత మంది దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Must Read ;- పరీక్షల నిర్వహణపై ప్లానేది.. సుప్రీం ధర్మాసనం అసంతృప్తి