పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో సాధించిన విజయం.. కార్యకర్తల పోరాట ఫలితమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పార్టీకి ఇంతటి విజయాన్ని సాధించిపెట్టిన కార్యకర్తలకు, యోధులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇక్కడా అధికారయంత్రాంగం, పోలీసుల్ని వాడుకుని వైసీపీ వాళ్లు హత్యలు చేశారు, కిడ్నాప్లకు పాల్పడ్డారు, నామినేషన్ పత్రాలు చించేశారు, ఆస్తులు తగులబెట్టారు, ప్రలోభాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారు.(2/4)
— Lokesh Nara (@naralokesh) February 10, 2021
గాలి హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ఫేక్ పార్టీకి ఇచ్చిన ఒక్క చాన్సే.. చివరి చాన్స్ అని ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టంగా చెప్పారన్నారు. ‘వైఎస్ జగన్రెడ్డి ఇంట్లో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. జనం గుండెల్లోంచి పుట్టిన తెలుగుదేశం పార్టీతో పోలికా?’ అని ప్రశ్నించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జనంలో ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని భావించిన జగన్ రెడ్డి.. రాజ్యాంగ వ్యవస్థలపై దాడికి తెగబడ్డారని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ జగన్రెడ్డి ఇంట్లో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి.జనం గుండెల్లోంచి పుట్టిన తెలుగుదేశం పార్టీతో పోలికా?(4/4)
— Lokesh Nara (@naralokesh) February 10, 2021
న్యాయస్థానాల చొరవతోనే స్థానిక ఎన్నికలు జరిగాయన్నారు. ‘అధికార యంత్రాంగం, పోలీసుల్ని వాడుకుని వైసీపీ వాళ్లు హత్యలు చేశారు. కిడ్నాప్లకు పాల్పడ్డారు. నామినేషన్ పత్రాలు చించేశారు, ఆస్తులు తగులబెట్టారు, ప్రలోభాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఇన్ని చేసినా ఎదురొడ్డి నిలిచి గెలిచారు తెలుగుదేశం యోధులు, కార్యకర్తలు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
Must Read ;-కోరి తెచ్చిన పథకం.. జగన్కు కొరివై కూర్చుందా?