ఒకవైపు సుదూర ప్రాంతాలనుంచి భక్తితో వచ్చే వారిని తిరుమలలో అడుగుపెట్టడానికి కూడా అనుమతించరు. మరోవైపు.. నిబంధనలను తొక్కేసుకుంటూ.. అక్రమంగా ప్రవేశించే వారికి పెద్దపీట వేసి దర్శనాలు కల్పిస్తారు. ఇలాంటి టీటీడీ దుర్మార్గపు పోకడలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెచ్చిపోయారు. తిరుమల పవిత్రత మంటగలిసిపోతుండడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలేశుని వైభవాన్ని కించపరిచేలా వ్యవహరించే ప్రభుత్వపోకడలను దునుమాడారు. ఈ మేరకు నారా లోకేష్ ట్విట్టర్ లో వరుస ట్వీట్లు పెట్టారు.
‘‘జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండీ తిరుమల పవిత్రతను మంటగలిపే చర్యలకు పాల్పడుతున్నారు.
లడ్డూ ప్రసాదం రేటు పెంచడం దగ్గర నుండి డిక్లరేషన్ వివాదం వరకూ అన్నీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలే. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడం హేయమైన చర్య.
ఈ ఘటన ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వైకాపా నాయకుడైతే చాలా? 2 వేల మందితో వచ్చినా తెరుచుకున్న ద్వారాలు సామాన్య భక్తుడుకి ఎందుకు మూసుకుపోయాయి? తిరుమల కొండ మీద రాజకీయ భజన చెయ్యడం దారుణం.
భక్తులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు,మనోభావాలను దెబ్బతీసిన టిటిడి అధికారుల పై చర్యలు తీసుకోవాలి.’’అని లోకేష్ ట్వీట్లు చేశారు.
వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రెండు వేల మంది అనుచరులతో తిరుమలకు వస్తే వారందరికీ టికెట్లు లేకపోయినా దర్శనం కల్పించడం అదే సమయంలో.. దూరప్రాంతాలనుంచి వచ్చిన వేల మంది భక్తులను తిరుపతి అలిపిరి వద్దనే అడ్డుకోవడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా.. ఇలాంటి దుర్మార్గపు పోకడలను తప్పు పడుతున్నారు. టీటీడీ అధికారులు ఈ వివాదంలోంచి ఎలా బయటపడతారో చూడాలి.
Must Read ;- దేవుడైతే మాకేంటి? ప్రభుత్వం మాది.. ఏమైనా చేస్తాం..
శ్రీవారి పై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టం. @ysjagan కి దేవుడంటే లెక్కలేదు, ప్రజలంటే గౌరవం లేదు. వైకాపా నాయకుల అహంకారానికి హద్దేలేదు. భక్తులపై లాఠీ ఛార్జ్ చేయించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి.(1/2) pic.twitter.com/9xP3CU98yr
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 24, 2020