విశాఖపట్నంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయం ముట్టడించడానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించిన సందర్భంగా.. చాలా దూకుడుగా వ్యవహరించారు. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యేపై నిరసనలు వ్యక్తం చేసే క్రమంలో భాగంగా.. అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసులమీద కూడా వైసీపీ నాయకులు దాడిచేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కార్యాలయం ముట్టడికి వచ్చిన వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నాయకులు పోలీసులపైనే రౌడీయిజం చేయడం గమనార్హం.
వివరాలు ఇలా ఉన్నాయి..
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నంను ప్రకటించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అక్రమని విజయనిర్మల ఆధ్వర్యంలో పెద్దప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రాజీనామా చేయ్యాలంటు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెలగపూడి ఇంటివద్ద కు టిడిపి కార్యకర్తలు చేరుకున్నారు. ఆయన కార్యాలయాన్ని ముట్టడించడానికి వైసీపీ వారు ప్రయత్నించారు. తూర్పు నియోజకవర్గం లో భారీ గా పోలీసులు మోహరించారు. వెలగపూడి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య బాగా తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులను వైసీపీ నాయకులు ఏమాత్రం ఖాతరు చేయకుండా వ్యవహరించారు.
జగన్పై ధ్వజమెత్తిన వెలగపూడి
ఈ సందర్భంగా విశాఖ తూర్పు తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జగన్ మోహన్ రెడ్డి పాలన మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ కి దేనిపైన నమ్మకం లేదని, విలువ లేదని ఆయన ఆరోపించారు. మిషన్ బిల్డ్ ఏ పి లో తుఫాన్ షెడ్, పోలీస్ క్వార్టర్స్, భూములు…అమ్మే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 16 వతేదీన జస్టిస్ రాకేష్ కుమార్ బెంచ్ నేతృత్వంలో విచారణ జరుగుతుండగానే భూములు అమ్మేశారని అన్నారు. ఉన్న భూములు అమ్మి సంక్షేమం చేయడం అనేది పద్ధతి కాదని రామకృష్ణ బాబు ఆరోపించారు.
న్యాయ వ్యవస్థ పై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, జస్టిస్ రాకేష్ కుమార్ పై బురద జల్లి మానసికంగా క్రుంగదీస్తున్నారని వెలగపూడి ఆరరోపించారు. పేదల భూములే లాక్కొని.. పేదలకు ఎలా భూములు ఇస్తారంటూ ప్రశ్నించారు. విశాఖ ప్రజలు నలుగురు ఏమ్మెల్యేలను గెలిపించారని అంటూ, రెఫరెండం పెట్టండి ప్రజలు ప్రభుత్వం వైపు ఉన్నారో.. ప్రతి పక్షం వైపు ఉన్నారో తేలుతుందని అన్నారు. మూడు రాజధానులు పై రెఫరెండం పెడితే చంద్రబాబు తో పాటు మేము కూడా రాజీనామా కి సిద్ధం అని ప్రకటించారు.
జగన్మోహన్ రెడ్డి విశాఖకు రాజధాని తరలించాలని అనుకుంటుండగా.. విశాఖకే చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే తాను రాజీనామా చేస్తానంటూ సవాలు విసరడం ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు ఏమంటున్నారంటే..
వైకాపా గూండాలతో పోలీసులకు కూడా రక్షణ లేకుండాపోయిందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయానికి కాపలాగా ఉన్న పోలీసుపై వైకాపా గూండాలు ఎంతో ధైర్యంగా దాడి చేశారని, ఆంధ్రప్రదేశ్ మారిపోయిందనటానికి షాక్ కు గురిచేసే భయానక చిత్రమిది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు దాడికి సంబంధించిన ఫోటోని కూడా జత చేసిన చంద్రబాబు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.
Also Read : ‘తోటపల్లి’కి వైసీపీ బ్రేక్.. రైతన్నల గగ్గోలు
A shocking & horrifying picture of what Andhra Pradesh has become. This brazen attack on a policeman guarding MLA Velagapudi Ramakrishna's office shows the extent to which the YSRCP goondas have been emboldened. Even a policeman isn't safe in Andhra Pradesh anymore. pic.twitter.com/Bp4RJgrQSf
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) December 18, 2020