నేచురల్ స్టార్ నానీ ప్రస్తుతం టక్ జగదీష్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు. అలాగే.. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలోనూ, వివేక్ ఆత్రేయ కామెడీ ఎంటర్ టైనర్. అంటే సుందరానికీ సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. అలాగే.. టక్ జగదీష్ సినిమా విడుదల ముంగిట్లోనే ఆగిపోయింది. అందుకే ప్రస్తుతం నానీ కథలేమీ వినడంలేదు.
త్వరలోనే లాక్ డౌన్ పూర్తి కానుంది. దాంతో సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో నానీ ఇప్పుడిప్పుడే కథలు వినడం మొదలు పెడుతున్నాడు. అందులో భాగంగా.. కొత్త కుర్రోడు శ్రీకాంత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇంకా వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తోనూ ఒక సినిమాకి కమిట్ అవుతున్నాడు. యం.సీ.ఏ తరహాలో సాగే.. ఓ కామెడీ అండ్ ఎమోషనల్ కథను వేణు .. నానీ కి వినిపించాడట. దానికి చాలా ఇంప్రెస్ అయిన నానీ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇంకా మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ ను నానీ వరుగా లైన్ లో పెట్టుకుంటున్నాడు.
Must Read ;- ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’తో మళ్ళీ ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ ?