ఆనందయ్య మందు అందరికీ అందాలంటే తయారీ విధానాన్ని అన్ లైన్ ద్వారా లక్షలాది మందికి నేర్పించాలని మత ప్రచారకుడు కేఏపాల్ విజ్ఞప్తి చేశారు. కరోనాకు ఉచితంగా ఆయర్వేద మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్యను కృష్ణపట్నం నుంచి మద్రాసు కానీ, హైదరాబాద్ అమీర్ పేటలోని తన కార్యాలయానికి కానీ రక్షణ కల్పించి వెంటనే తరలించాలని కేఏ పాల్ ముఖ్యమంత్రికి విజ్ఙప్తి చేశారు. ఆనందయ్య తనకు ఉన్న సామర్థ్యంతో రోజుకు కేవలం 4 వేల మందికి మాత్రమే మందు సరఫరా చేయడం వల్ల ప్రయోజనం లేదని ఆయన అన్నారు. ఇప్పటికే 70 కోట్ల మంది కరోనా బారిన పడ్డారని, వారందకీ కరోనా మందు అందాలంటే 7 లక్షల మందికి ఆనందయ్య అన్ లైన్లో రెండు గంటల పాటు శిక్షణ ఇవ్వాలన్నారు. ఇలా చేయడం ద్వారా దేశంలో 70 కోట్ల మందికి ఒకే రోజు కరోనా మందు అందుతుందని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు.
అందరికీ నేర్పించాలి..
ఆనందయ్య మందు అందరికీ అందాలంటే ఆయన తయారీ విధానాన్ని అన్ లైన్ ద్వారా లక్షలాది మందికి నేర్పించాలని కేఏపాల్ విజ్ఞప్తి చేశారు. ఆనందయ్యను హైదరాబాద్ అమీర్పేటలోని తన కార్యాలయానికి తరలిస్తే తాను అందరికీ ఆన్ లైన్ ద్వారా మందు తయారీ విధానాన్ని నేర్పించే ఏర్పాట్లు చేస్తానని పాల్ ప్రకటించారు. ఇప్పటికైనా ఆనందయ్యకు రక్షణ కల్పించి మద్రాసు లేదా హైదరాబాద్ తరలించాలని కేఏ పాల్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి విజ్ఙప్తి చేశారు.
Must Read ;- చేతులెత్తేసిన ప్రభుత్వం : ఆనందయ్య మందు పంపిణీ ప్రశార్థకం