ఆనందయ్య మందు పంపిణీ నిలిచి పోయింది. సోమవారం నుంచి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక వెబ్సైట్ ఏదీ లేదని తేల్చి చెప్పింది. వారం కిందటే childeal.in వెబ్ సైట్ ద్వారా మందు కావాల్సిన వారికి కొరియర్, పోస్ట్ ద్వారా పంపిస్తామని జిల్లా కలెక్టర్ చక్రధర్ ప్రకటించారు. ఇందుకు ఓ వెబ్ సైట్ కూడా తయారు చేశారు. అయితే అందులో మందు పంపిణీకి రూ.167 చెల్లించాలని ముందుగా ప్రకటించారు. అయితే ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెబ్ సైట్ నిలిపివేశారు. దీంతో ఆనందయ్య మందు పంపిణీ లేదని తేలిపోయింది.
వైసీపీ ఎమ్మెల్యే పెద్ద స్కెచ్ వేశారు
కరోనా ఫస్ట్ వేవ్లో రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటే..సెకండ్ వేవ్లో ఆనందయ్య కుటుంబ సంప్రదాయ వైద్యాన్ని టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి వందల కోట్లు కాజేందుకు స్కెచ్ వేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఆనందయ్య మందు అమ్మకం పేరుతో childeal.in వెబ్ సైట్ను నెల్లూరుకు చెందిన సెశ్రిత కంపెనీతో రూపొందిచారు. మే 21వ తేదీన గోడాడీ కంపెనీ వద్ద డొమైన్ కొనుగోలు చేసిన సెశ్రిత టెక్నాలజీ ఇండియా ప్రై లిమిటెడ్ వెబ్ సైట్ను కొంత వరకు రూపొందించింది. ఓ వైపు సీఎం ఫోటో, మరొవైపు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆనందయ్య ఫోటోలతో సైట్ సిద్ధం చేశారు. హైకోర్టు మందు పంపిణీకి అనుమతించిన 31వ తేదీనే ఆన్ లైన్లో మందు పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించామని అందులో ప్రకటించారు. అయితే అనేక విమర్శలు రావడంతో జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత ఆన్ లైన్లో childeal.in వెబ్ సైట్ను నిలిపివేశారు.
Must Read ;- చేతులెత్తేసిన ప్రభుత్వం : ఆనందయ్య మందు పంపిణీ ప్రశార్థకం
ఇది నకిలీ వెబ్ సైట్
ఆనందయ్య మందును క్యాష్ చేసుకునేందుకే నకిలీ వెబ్ సైట్ తయారు చేశారని తెలుస్తోంది. ఓ వైపు ఫ్యాన్ గుర్తు, సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, కాకాణి ఫొటోలు, వైసీపీ రంగులతో వెబ్ సైట్ హోమ్ పేజీని అలంకరించారని టీడీపీ నేత చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. నకిలీ మద్యం, నకిలీ పత్రాలకు తరహాలోనే నకిలీ వెబ్ సైట్ రూపకల్పన చేశారని ఆయన గుర్తు చేశారు. ఆనందయ్య మందు కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది ప్రజల వద్ద భారీగా దండుకునేందుకు కుట్ర పన్నారనే విమర్శలు వచ్చాయి. ఆనందయ్య ఆయుర్వేదం మందు ఒక్కో ప్యాకెట్ రూ.167కి అమ్ముకునేందుకు వైసీపీ నేతలు చక్కగా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. అయితే ఉచితంగా మందు పంపిణీ చేయాలని మొదటి నుంచీ ఆనందయ్య భావించారు. వైసీపీ నేతలు మందును అమ్మకానికి పెట్టడంపై ఆనందయ్య ప్రశ్నించారు.దీంతో వైసీపీ నేతల గొంతులో వెలక్కాయ పడినట్టయింది.
కథ అడ్డం తిరిగింది..
తాను తయారు చేస్తున్న మందును ఉచితంగానే పంపిణీ చేయాలని ఆనందయ్య పట్టుపట్టడంతో వైసీపీ నేతల కుట్రకు తెరపడింది. దీంతో కథ అడ్డం తిరిగిందని భావించిన వైసీపీ ఎమ్మెల్యే కాకాణి వెబ్ సైట్ను హడావుడిగా బ్లాక్ చేయించారు.అప్పటి వరకు మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని హడావుడి చేసిన కాకాణి ఒక్క సారిగా ప్లేటు ఫిరాయించాడు. ఆనందయ్య మందుకు, తమకు, తమ పార్టీకి సంబంధం లేదని ప్రకటించారు. తాడేపల్లి నుంచి వచ్చిన సూచనల ఆధారంగానే కాకాణి ఇలాంటి ప్రకటన చేసి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Must Read ;- 7వ తేదీ నుంచి ఆనందయ్య మందు.. ఆన్లైన్లోనే పంపిణీ











