(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఒకవైపు నీలాకాశం… మరోవైపు తెల్లటి నురగలు కక్కుతున్న సముద్ర కెరటాలు… వాటికి ఏ మాత్రం తీసిపోని విధంగా నీలి విద్యుత్ దీపకాంతులు.. అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖలోని రుషికొండ బీచ్ ను నీలి కాంతుల తో సింగారించారు. ఎటుచూసినా న నీలి వర్ణంలో ని విద్యుత్ కాంతులు సందర్శకులను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. నీలి వర్ణంలో ఎగసిపడుతున్న కెరటాల తో పోటీ పడేలా తీరాన్ని పర్యాటక శాఖ అధికారులు అలంకరించారు.
అంతర్జాతీయ బాలల దినోత్సవం మొదటి సారిగా 1954 లో నిర్వహించారు. ప్రతి సంవత్సరం నవంబరు 20 న అంతర్జాతీయ ఏకత్వం, బాలల హక్కులపై జాగృతి కలిగించడం లక్ష్యంగా వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. 1959 సంవత్సరం నవంబరు 20 న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల డిక్లరేషన్ తీసుకొని వచ్చింది. అంతర్జాతీయ బాలల దినోత్సవం నీలి రంగు దీపాలతో అలంకరించి వేడుక చేయడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ సందర్భముగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సాయంత్రం రుషికొండ బీచ్ వద్ద నీలి రంగు దీపాలతో పర్యాటక శాఖ అలంకరణ చేపట్టింది.
Must Read ;- ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఏమిటో చూపించిన చంద్రబాబు