అస్సాం లో యువతిని అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ యువకుడిని అక్కడి పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకుంది.బికి అలీ అనే యువకుడు నలుగురు స్నేహితులతో కలిసి గరియాన్లోని ఓ హోటల్లో ఒక మైనర్పై లైంగిక దాడికి పాల్పడినట్టు పాన్బజార్ మహిళా పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై అత్యాచారం తర్వాత బికి అలీ సహాయ అతని స్నేహితులంతా అక్కడి నుంచి పరారయ్యారు. అయితే కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బికి గురించి సమాచారం తెలియడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు చర్చలు కొనసాగిస్తున్నారు.అయితే సామూహిక లైంగిక దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బికి అలీని పోలీస్ స్టేషన్ కు తరలించగా అలీ తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు రాత్రి సమయంలో ప్రయత్నించాడని గువాహటి పోలీసులు వెల్లడించారు. అలీని ఆపె ప్రయత్నం చేసిన పలువురు పోలీసులపై అతడు దాడికి పాల్పడ్డాడాని వారు తెలిపారు. లొంగిపోవాలని హెచ్చరించినా అలీ వినలేదని.. ఈ క్రమంలో తాము ఆత్మరక్షణ కోసం అతడిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి అలీ దాడిలో ఇద్దరు మహిళా పోలీసులు గాయపడినట్టు పోలీసు అధికారులు తెలిపారు.
Must Read:-అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!