అనంతపురం జిల్లా టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్పై పోలీసులు మరో కేసు పెట్టారు. స్థానిక ఎన్నికల సందర్భంలో ఓ కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ తాజాగా మరో కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల గ్రామంలో అనారోగ్యంతో ఉన్న టీడీపీ కార్యకర్తను పలకరించేందుకు పరిటాల శ్రీరామ్ వెళ్లారు. అయితే పరిటాల శ్రీరామ్ తమపై దాడి చేశారంటూ ముష్టికోవెల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్త బత్తిన వెంకటరాముడు ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరామ్తో పాటు ముష్టికోవెల గ్రామానికి చెందిన 9 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖండించిన శ్రీరామ్
ముష్టికోవెల గ్రామంలో ఎలాంటి గొడవ జరగలేదని, తాము ఎవరిపై దాడి చేయలేదని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని పరిటాల శ్రీరామ్ స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని శ్రీరామ్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
Must Read ;- టీకాకు రూ.35వేల కోట్లు వృథా అన్న వైసీపీ ఎంపీ.. తెలివితక్కువతనమని టీడీపీ కౌంటర్