పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలను, ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు ఈ యాక్షన్ సన్నివేశాలలో దగ్గుబాటి రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలసి పాలు పంచుకుంటున్నారు.ఈ క్రేజీ మూవీకి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు పాల్గొనగా పదిరోజులపాటు హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతుందని నిర్మాత తెలియచేశారు.
అయితే.. ఫస్ట్ డే షూటింగ్ గురించి రానా ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఫస్ట్ డే షూటింగ్ అద్భుతం అంటూ తెలియచేస్తూ.. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థకు, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అంటూ తన సంతోషాన్ని షేర్ చేశారు. ఇందులో సముద్ర ఖని, మురళీశర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవర్ స్టార్ విక్టరీ వెంకటేష్ తో గోపాలా గోపాలా సినిమా చేశారు. ఇప్పుడు రానాతో కలిసి ఈ సినిమా చేస్తుండడం విశేషం.
Must Read ;- పవర్ స్టార్ అయ్యప్పన్ గా బరిలోకి దిగారు.. !
What an awesome day 1 🔥🔥🔥!! Thank you @SitharaEnts and @PawanKalyan garu !! Pleasure to be on board!! https://t.co/h5wEfKghIi
— Rana Daggubati (@RanaDaggubati) January 28, 2021











