విక్టరీ వెంకటేష్ ఓ వైపు నారప్ప సినిమా చేస్తూనే.. మరో వైపు ఎఫ్ 3 మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమిళ్ లో సక్సస్ సాధించిన అసురన్ మూవీకి రీమేక్ గా నారప్ప మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్వకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, కలైఫలి ఎస్ థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
ఇందులో ఫార్మర్ గా ఇద్దరు పిల్లలకు ఫాదర్ గా వెంకీ నటిస్తున్నారు. వెంకీకి భార్యగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టరస్ ప్రియమణి నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా వర్క్ లో స్పీడు పెంపచారు. ఇటీవల ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. అయితే.. నారప్ప అవుట్ పుట్ పట్ల డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల హ్యాపీగా లేరట. అందుకే వెంకీతో కొన్ని సీన్స్ రీషూట్ చేద్దామని అడిగారట.
రీషూట్ కోసం ఐదు రోజులు డేట్స్ అడిగితే.. వెంకీ నో చెప్పారని.. దాంతో శ్రీకాంత్ అడ్డాల బాగా అప్ సెట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. అయితే.. వెంకీ నో చెప్పడంతో.. శ్రీకాంత్ అడ్డాల.. సురేష్ బాబు ద్వారా వెంకీని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరి.. వెంకీ రీషూట్ కి ఓకే చెబుతారో లేదో చూడాలి.
Must Read ;- ‘క్రాక్’ సినిమా వెంకీ చేయాల్సిందట!