లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నటి ప్రియ ఆనంద్. ఆ తర్వాత వచ్చిన రామ రామ కృష్ణ కృష్ణ, 180 వంటి చిత్రాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగు, తమిళం , హిందీ భాషల్లో పలు చిత్రాలలో నటించిన ఈ బ్యూటీ తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. ఇంగ్లీష్ వింగ్లీష్, కో అంటే కోటి, రంగ్రేజ్ , ఫుక్రే వంటి చిత్రాలు ఈమెకు మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయి. అయితే గత కొద్ది కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్న ఈ భామ “మా నీళ్ల ట్యాంక్” అనే ఓ వెబ్ సిరీస్ తో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. ఇందులో అక్కినేని సుశాంత్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ప్రస్తుతం వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో బిజీగా ప్రియ ఆనంద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదస్పద స్వామిజీ, పలు కేసుల్లో నిందితుడిగా ఉండి దేశం విడిచి కైలస అనే దీవిలో ఉంటున్న నిత్యానందను పెళ్లి చేసుకోవాలనుంది అంటూ ప్రియా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియ ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేసింది.
వాస్తవానికి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం అవుతున్నా సోషల్ మీడియాకు మాత్రం మొదటి నుంచి కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో అమ్మడు నిత్యానంద సూక్తులను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను ‘నిత్యానంద సూక్తులను పోస్ట్ చేయడానికి కారణం ఏంటని ప్రశ్నించగా ‘‘నాకు నిత్యానంద అంటే ఇష్టం అంటూ తన మనసులోని ప్రేమను వ్యక్తపరిచింది ఈ బ్యూటీ.. ఆయనను ఎంత మంది విమర్శించినా వేలాదిమంది ఫాలో అవుతున్నారని.. కుదిరితే తనకు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది.
అక్కడితో ఆగలేదు.. ఒకవేళ నిత్యానందతో పెళ్లి జరిగితే తన పేరు కూడా మార్చుకోవలసిన అవసరం లేదంటూ సేటఇరికాల గా చెప్పుకొచ్చింది. తమ ఇద్దరి పేర్లు ఇంచుమించు ఒకేలా ఉంటాయని ప్రియా ఆనంద్ సమాధానమిచ్చింది. అయితే ఈ విషయంలో ఆమె జోక్ చేసిందా లేక సరదాగా అన్నదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారగా.. ఈ మాటలకు ప్రియ అభిమానులు సైతం ఆవాక్కవుతున్నారు..