RS Praveen Kumar Voluntary Retirement To Pursue His Passion For Social Justice :
ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాలంటరీ రిటైర్మ్ మెంట్ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇక మీదట తాను ఐపీఎస్ గా కొనసాగలేనని.. కొత్త ప్రపంచంలో అడుగుపెట్టేందుకు పదవీ విమరణ చేస్తున్నానని వెల్లడించారు. ఈ మేరకు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. పదవీ విరమణ తర్వాత కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతానని, స్వేచ్ఛ, సమానత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఐపీఎస్ గా రెండున్నర దశాబ్దాలుగా సేవ చేశానని, పోలీస్ శాఖలో పనిచేయడం తనకెంతో నచ్చిందన్నారు. ఇక మీదట తన మనసుకు నచ్చిన పనులే చేస్తానని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.
పేదలను కొత్త ప్రపంచంలోకి నడిపిస్తా
పదవీ విమరణ తర్వాత పూలే, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తానని, పేదలను కొత్త ప్రపంచంలోకి నడిపిస్తానని వెల్లడించారు. 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్.. గత 10 ఏళ్లుగా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఒక అధికారి అదే పోస్టులో ఇంత సుదీర్ఘకాలం పనిచేయడం, ఆ పదవిలో ఉంటూ స్వెరో అనే పేరుతో ప్రైవేటు సంస్థను నడిపించడం అసాధ్యమే అని చెప్పాలి. తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ కుమార్ ఎన్నో సంచనాలను నమోదు చేశారు. ఒకప్పుడు గురుకులాలు అంటేనే ప్రజలు భయపడిపోయేవాళ్లు. ప్రవీణ్ రాకతో ‘గురుకులాల్లోనే సీటు కావాలి అనే స్థాయి’కి చేరింది. పిల్లలకు మెరుగైన విద్య, మంచి భోజనం, పర్వతరోహణలో శిక్షణ, క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్ లాంటి క్రీడల్లో ట్రైనింగ్.. లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటివరకు పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆర్ఎస్ .. పేద ప్రజలను కొత్త ప్రపంచంలో నడిపిస్తానని ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది.
Must Read ;- చుట్టుముడుతున్న వివాదాలు.. సునీల్ కుమార్కు పదవీ గండం?
After 26 years of serving the motherland as an IPS officer, I have applied today for voluntary retirement to pursue my passion for social justice and equality with more vigour at my own pace. I thank you all for standing by me throughout my career.🙏🏼 pic.twitter.com/IZM9Jztimd
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 19, 2021