జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆవేశం ఎక్కువ…ఆలోచన తక్కువని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పగలు ఒక పార్టీతో, రాత్రి మరో పార్టీతో ఉండే పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక విమర్శలు చేస్తున్నాడని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ధ్వజమెత్తారు. బీజేపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు.
తిరుపతిలో భారీ విజయం సాధిస్తాం..
ఎవరెన్ని విమర్శలు చేసినా తిరుపతిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీతో గెలుస్తారని సజ్జల జోస్యం చెప్పారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు సీఎం జగన్కు అండగా నిలిచారని ఆయన తెలిపారు. జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిపిస్తాయని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి పోయాడని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు.
Must Read ;- వైసీపీ ఫ్యాక్షన్ గూండాలకు భయపడం పవన్ కళ్యాణ్