
ఈ అమ్మాయి మొదటిసారి 2018 ఐపీఎల్ సీజన్లో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంటే తనకు పిచ్చని పదే పదే చెబుతూ ఉంటుంది. ఆ అభిమానాన్ని తరచూ చాటుతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ధోనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంది. మాలతీ ఇద్దరు సోదరులు ఐపీఎల్లో వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. దీపక్ చాహర్ చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. రాహుల్ చాహర్ ముంబై ఇండియన్స్కు ఆడుతున్నాడు.