Smriti Mandhana Reveals Her Crush :
సినిమా రంగంలో హీరోయిన్లు క్రికెటర్లను పెళ్లి చేసుకోడానికి ఇష్టపడతారు. క్రీడాకారిణుల దృష్టి మాత్రం సినిమా హీరోల మీదే ఉంటుంది. బాలీవుడ్ లో షర్మిలా టాగోర్ పటౌడీని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. నేటి తరానికి వస్తే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల తమిళ హీరో విష్ణు విశాల్ ను ప్రేమించి పెళ్లి పీటలెక్కింది. అయితే అనుకున్నవన్నీ నెరవేరవు. లేడీ క్రికెటర్ స్మృతి మంధాన ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాలని అనుకుందట. అతను మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.
జులై 18 స్మృతి మంధాన పుట్టిన రోజు. 1996లో ముంబైలో ఆమె జన్మించింది. లేడీ క్రికెటర్లలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ తర్వాత అలాంటి క్రేజ్ ఉన్న క్రికెటర్ స్మృతి మంధానా. యువతలో ఆమెకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యంలోనూ ఆమె దూసుకుపోతోంది. బ్రాండ్ అంబాసిడర్ గా ఎంతో క్రేజ్ సంపాదించింది. నైకీ లాంటి బడా సంస్థకు ఆమె బ్రాంగ్ అంబాసిడర్ గా చేస్తోంది. సాధారణంగా ఏదైనా వ్యాపార సంస్థకు ఆమె ఏడాదికి రూ. 50 లక్షలు తీసుకుంటుందట.
నైకీ దీనికి రెట్టింపు ఇస్తోందన్న ప్రచారం ఉంది. ఆమె దాదాపు రూ. 30 కోట్ల ఆస్తులను కూడబెట్టిందట. పైగా బీసీసీఐ నుంచి ఆమె ఏడాదికి రూ. 50 లక్షలు జీతంగా అందుకుంటుందట. ఆమె స్వస్థలం మహారాష్ట్రలోని సంగ్లీ. అక్కడ ఆమె ‘ఎస్.ఎం.18’ పేరుతో ఓ కెఫే కూడా నడుపుతోందట. ఓ పక్క ప్రచార కర్తగా, ఇంకో పక్క వ్యాపార వేత్తగా రెండు చేతులా సంపాదిస్తోంది. ఎయిర్ ఆప్టిక్స్, హైడ్రా గ్లైడ్, బాటా, రెడ్ బుల్, హీరో మోటార్స్, నైకీ లాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది. ఇక ఆమె క్రష్ విషయానికి వద్దాం.
స్మృతికి చిన్నప్పట్నుంచీ హృతిక్ రోషన్ అంటే విపరీతమైన ఇష్టమట. అతని సినిమా విడుదలైతే చూసి తీరాల్సిందే. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకుందట. కాకపోతే అప్పటికే హృతిక్ కు పెళ్లియిపోయిందట. ఏజ్ డిఫరెన్స్ ఉంది కానీ లేకుంటే ఆమె హృతిక్ ను పెళ్లి చేసుకుని ఉండేదోమో. హృతిక్ పై తనకున్న క్రష్ గురించి ఆమె స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలోనూ ఆమెకున్న క్రేజ్ వేరు. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. కొంతమంది ఆమెను బాలీవుడ్ హీరోయిన్లతోనూ పోలుస్తూ ఉంటారు. ఇదీ ఈ లేడీ క్రికెటర్ క్రష్ వ్యవహారం. చివరికి పెళ్లి ఎవరితో జరుగుతుందో చూడాలి.
Must Read ;- ఆ యువతి క్యాచ్ మహాద్భుతం!











