ఏం పీకుతారు .. నా( )చ్చా! హవ్వా…!
తొడకొట్టావ్ ..! జబ్బ చరిచావ్ ..! ఛాలెంజ్ విసిరావ్ ..!! డిసెంబరు 1, 2021 నాటికి పోలవరం ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తామని ప్రగల్భాలు పలికావ్ .. ఇప్పుడు వాటిని గుర్తు చేస్తుంటే .. ఏం పీకుతారు అంటూ ప్రతిపక్షాలపైనా, ప్రజలపైనా బూతులతో దాడి చేస్తాడు ఆ మంత్రి. హతవిధీ …! ఏపీ దౌర్భగ్యమేమిటంటే .. ప్రజాప్రనిధులు ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు బూతులు తిట్టొచ్చు.. కానీ ప్రజలు వారిని తిట్టకూడదు, ఖండించకూడదు. అలా చేస్తే నేరం. దేశ ద్రోహం. ప్రజలను పాలించే మీరే ఇంతటి చెండాలమైన బూతు ప్రయోగమైనా చేయవచ్చు.. కానీ ప్రజలకు మాత్రం వాటిని ప్రశ్నించకూడదు. భావ ప్రకటనపై స్వేచ్ఛపై అధికార గొడ్డలి పెట్టి నోర్లు మూయించాలని చూస్తారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఏ ఒక్క మంచి రాజకీయ విమర్శ అధికార పక్షం నుంచి విందామంటే..? కనీసం మచ్చుకైన కనిపించదు. బూతు మంత్రుల చేతిలో పాలన బాధ్యతలు పెట్టి .. తన పతనానికి తానే గొయ్యి తీసుకున్నాడు జగన్ అన్న విమర్శలు పాపం ఆయనకు వినిపించి ఉండవు కాబోలు! సిగ్గుండాలి అంటూ.. ఇటువంటి పదాలు టీవీల ముందు కూర్చున్న మహిళలు, చిన్నపిల్లలు తిట్టుకుంటూ చానల్స్ మారుస్తున్న సంగతి కూడా కనీసం ఎవరు చెప్పి ఉండరు కాబోలు! చనిపోయిన తరువాత పాడే మోయ్యడానికి కావాల్సింది నలుగురు. జగన్ రెడ్డిని పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టానికి ఆ నలుగురు బూతులు రాయుళ్లు చాలు.. అని సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఎప్పుడు చూసి ఉండరు కాబోలు! అని ప్రజలు నవ్వుకుంటున్నారు. పార్టీ పరువు, అధిష్టాన ఆలోచనలు, మహిళలు పట్ల, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధేమిటో అధికారపార్టీలో ఉన్న ఆ నలుగురే బాగా ప్రచారం చేస్తున్నారు. పోలవరం పూర్తి చేయలేదంటి అని అడిగితే .. అవును చేయలేదు .. ఏం పీక్కుంటారో పీక్కోండి అని నెల్లూరు జిల్లా నుంచి ఓ మంత్రి అంటాడు. నన్ను కమ్మకులం నుంచి వెలవేసి ఏం పీకుతారు .. నా()చ్చు కూడా పీకలేరని కృష్ణాజిల్లా నుంచి మరో మంత్రి టీవీ – 9 లైవ్ కూస్తాడు. వినేవాళ్లకే చెవుల్లో నుంచి రక్త పడుతుంటే .. అలా కావాలని వారిని కెలికి వినిపించే కొన్ని మీడియా ప్రతినిధులు అసలు మనుషులే కాదు .. మని(డబ్బుకు) కి సూటు బూటు వేసిన ఏటీఎం యంత్రాలు అని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇలా బూతులతో దాడిచేసి.. ఎవరి నోర్లు మూయిస్తారు?
బూతులతో ప్రతిపక్షాన్ని, కేసులతో మీడియాను, సోషల్ మీడియా నెటిజన్లను నోర్లు మూయిస్తారా? రాజ్యాంగ హక్కులను కాల రాస్తారా? రాష్ట్రంలో మరో ఎమర్జెన్సీని తీసుకొస్తారా? ఇలా అడుగుతూ పోతే.. సవాలక్ష ప్రశ్నాలు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అధికారపార్టీ ప్రజాప్రతినిధులను నిత్యం నిలదీస్తుంటాయి. మీరే వీటిని ప్రశ్నించకుని.. అప్పుడు మాట్లాండి బూతులు. ఎక్కడో న్యూజెర్సీలో డబ్బులిచ్చి మరి న్యాయాధిపతులపై బూతుల వర్షం కురిపిస్తున్నారుగా.. ఆ పాకీ ప్రభాకర్ ఒకడు చాలు మీ అధికారాన్ని ఊడబీకి ఇంటికి పంపడానికి. సన్నబియ్యం హామి పక్కనపెట్టి.. ముక్కిపోయిన బియ్యానికి వాహనాల పెట్టి .. వందల కోట్లు ధారబోస్తుంటే … వాటిపై విమర్శలు చేయకూడదు. అలాచేస్తే మీ అమ్మ మొగుడు చెప్పాడా? అంటూ మరో మంత్రి నిసిగ్గుగా లారీ క్లినర్లే తలదించేకునేలా మాట్లాడుతాడు. ఇంతకన్నా దౌర్బగ్యం ఏమైనా ఉందా జగన్ రెడ్డిగారు.. ‘మీ ఇలాకాలో ఇటువంటి బూతు వర్సిటీ నుంచి వచ్చిన వారు విమర్శించిన ప్రతిఒక్కరిపై ఇలా దాడులు చేస్తుంటే’ అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరచి జీవితంలో దిద్దుకోలేని తప్పులను గ్రహించండని.. రేపోమాపో మీపార్టీకి గుడ్ బై చెప్పనున్న రాజధాని రెండు జిల్లాలోని ఆ పదిమంది ఎమ్మెల్యేలు హెచ్చరికలు కూడా ఒక్కసారి పరిగణాలోకి తీసుకొండి.
Must Read ;- అంతర్జాతీయంగా భారత్ పరువు తీస్తున్న ఏపీ ప్రభుత్వం!!