Summer Heat Increasing in Telangana
తెలంగాణాలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే, మున్ముందు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎండ కారణంగా ఉక్కపోత, వడగాల్పులు కూడా ఎక్కువకావడంతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా భద్రాచలంలో అధికంగా 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్, వరంగల్, దుండిగల్, హకీంపేట కేంద్రాల్లో మినహా రాష్ట్రమంతటా 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఆదిలాబాద్లో తక్కువగా 19.2 డిగ్రీలు నమోదైంది. ఉత్తరాది నుంచి వడగాల్పులు వీయడం వల్లనే ఎండలు మండుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
Summer Heat in Telangana :
అత్యవసరమైతేనే బయటకు..
ఒకవైపు కరోనా, మరోవైపు ఎండలు తీవ్ర కావడంతో అత్యవసరమైతే బయటకు వెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 ఐదు గంటలలోపు బయటకు రాకుండా ఉండటం మంచిదని సూచించింది. నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, జ్యూస్ తాగాలని డాక్టర్లు చెప్తున్నారు.
Also Read:జనం చెవిలో క్యాబేజీలన్న విజయసాయి.. కోర్టుల చెవిలో పూలన్న సోము