చిత్తూరు టీడీపీ నాయకుడు కటారి ప్రవీణ్ కరోనాతో మృతి చెందారు. చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత భర్త అయిన ప్రవీణ్కు కరోనా పాజిటివ్గా తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారు. ప్రవీణ్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. మొదటి నుంచి ప్రవీణ్ కుటుంబం టీడీపీ బలోపేతానికి కృషి చేసిందని, ఆ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
Must Read ;- జగన్ నిర్లక్ష్యం వల్లనే, ఏపీలో 10 లక్షలు కరోనా కేసులు : అచ్చెన్నాయుడు











