అధికార బలంతో తిరుపతి లోక్ సభ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న వైసీపీకి, టీడీపీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అధికార పార్టీకి ఓట్లు వేయకపోతే, ప్రభుత్వ పథకాలు అందవంటూ బెదిరించేవాళ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. వైసీపీకి ఓటెయ్యకపోతే పథకాలు రావంటూ, భయపెట్టే వాలంటీర్ల గుట్టురట్టు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. బెదిరించే కాల్ రికార్డు కానీ, ఫోటో కానీ, వీడియో కానీ.. 7557557744 అనే నెంబర్కు వాట్సాప్ చేయాలన్నారు. పక్కా సమాచారం అందించేవాళ్ల బ్యాంక్ అకౌంట్లలో రూ. 10వేలు వేస్తామని అన్నారు. తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు మాత్రమే, ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. టీడీపీ వాట్సాప్ అఫర్ తో వైసీపీకి గట్టి షాక్ తగిలినట్లయింది.
మాకే ఎక్కువ ఓట్లు
రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా, తిరుపతిలోనే టీడీపీ గెలిచే అవకాశం ఉందన్నారు. ఎక్కువ శాతం ఓట్లు తిరుపతిలోనే ఉన్నాయన్నారు. పథకాలు పోతాయనే భయం అవసరం లేదని, ప్రజా ధనాన్ని దోచుకుంటున్న జగన్ రెడ్డికి సరైన బుద్ది చెప్పాలన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అలర్ట్ గా ఉండాలని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు తిరుగబడే రోజుల్లో దగ్గర్లోనే ఉన్నాయని, ఎన్నికలో తిరుపతికి మద్దతు తెలిపాలని అచ్చెన్నాయుడు కోరారు.











