తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక వరాలు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖలకు చెందిన పలువురు ప్రముఖులు ధన్యవాదాలు తెలియజేశారు.. థియేటర్లు పునః ప్రాంభించుకునేలా జీవో విడుదల చేయడంతో పాటు సినీ రంగానికి లాభం చేకూర్చే పలు నిర్ణయాలు తీసుకున్న ఆయనకు పరిశ్రమ పక్షాన ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, నిర్మాతల మండలి ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, సెక్రటరీలు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, తెలుగు చిత్ర దర్శక మండలి అధ్యక్షకులు యన్.శంకర్, మా కార్యదర్శి శ్రీమతి జీవిత రాజశేఖర్, కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి సినీ పరిశ్రమలోని వివిధ శాఖలకు చెందిన ప్రముఖులు హాజరయి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కెసీఆర్ తో ఒక సంవత్సరం గా దీనిపై చర్చలు సాగుతున్నాయని.. ఎట్టకేలకు ఇప్పుడు మన ఇండస్ట్రీకి ఆయన రాయితీలు ప్రకటించిన వరాలు కురిపించడం చాలా ఆనంద దాయకమని చెప్పారు.
నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇది కేసీఆర్ జీహెచ్ యంసీ మేనిఫెస్టో అయినా.. మా సినిమా పరిశ్రమకు మాత్రం సినీ మ్యానిఫెస్టోనే అన్నారు. ఇది మన డైనమిక్ సియం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని చెప్పారు. త్వరలో చలన చిత్ర పరిశ్రమ తరపున కెసీఆర్ కు భారీ ఎత్తున స్మానం నిర్వహిస్తామని చెప్పారు. అలాగే.. ఏపీ సి.యం. వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కూడా కలిసి ఈ సన్మాానానికి తీసుకువస్తామని చెప్పారు.
దర్శక మండలి అధ్యక్షకులు యన్. శంకర్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు ఇంతగా ఇన్ని వరాలు కురిపించిన ముఖ్యమంత్రి కెసీఆర్ అభినందనీయులని, ఆయన కు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ రుణ పడి ఉంటుందని చెప్పారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. నిన్నటి వరకూ తనకు ఈ రాయితీలు ఇవ్వడం మీద అనుమానాలుండేవని, సినీ పెద్దలముందు వాటిని వ్యక్తం చేశానని, చివరికి వారు నివృత్తి చేశారని చెప్పారు. నిజంగా సినీ పరిశ్రమకు ఇన్ని వరాలు ఇచ్చిన కేసీఆర్ నిజంగా డైనమిక్ సియం అని ఆయన్ను ప్రశసించారు.
ఇంకా మరికొందరు సినీ ప్రముఖులు ఈ సమావేశంలో మాట్లాడి.. కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
చిన్న చిత్రాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్, అలాగే ఇష్టప్రకారం షోలు పెంచుకునే వెసులుబాటు, సినిమా టికెట్ల ధరను రూ.50 నుంచి రూ.250 వరకు నిర్ణయించుకునే అధికారాన్ని సైతం నిర్మాతలకు ఇవ్వడం, సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం ఆనందదాయకమని తెలుగు సినీ నిర్మాతల మండలి పేర్కొంది. ఇందుకు తమవంతు తీవ్రంగా కృషి చేసిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలకు, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఇతర శాఖలకు మండలి తరపున వారు కృతజ్జతలు తెలిపారు.
Must Read ;- మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్!