తెలుగు సినీరంగానికి వరాలు కురిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మెగాస్టార్ చిరంజీవి కృతఙ్ఞతలు తెలియజేశారు. సోమవారం సినీ పరిశ్రమకు రాయితీలు ప్రకటిస్తూ కేసీఆర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. దీనిపై చిరంజీవి స్పందిస్తూ, కరోనా తో చిత్ర పరిశ్రమ కుదేలయింది. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్ మెంట్, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ చార్జీలు రద్దు, అలాగే షోలు పెంచుకునేందుకు, టిక్కెట్ల రేట్లు సవరించుకునే అనుమతిని ఇస్తూ నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకం. అని అన్నారు.
Also Read:-మెగాస్టార్ చిరంజీవికి నో పాజిటివ్.. కరోనా కిట్లే నెగిటివ్?
దీనివల్ల చిత్రపరిశ్రమపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని చిరంజీవి పేర్కొన్నారు. కేసీఆర్ విజన్ కు తగ్గట్లుగా తెలుగు సినీ పరిశ్రమ దేశంలోనే మొదటి స్థానాన్ని అందుకుంటుందన్న పూర్తి విశ్వాసం తమకుందన్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా సీఎం కేసీఆర్ కు కృతఙ్ఞతలు తెలియజేశారు. హీరోలు, దర్శకులు తమ ట్విట్టర్ ఖాతాల ద్వరా ఈ నిర్ణయాన్ని హర్షించారు.











