ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తన పాదయాత్రలో, సభలలో ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి సోదరుడికి.. మీ ఆప్యాయతలకు, మీ అనురాగలకు, మీ అభిమానానికి శిరస్సు వంచి అంటూ.. మీ ఇంటిలో ఒకడిగా, మీలో ఒకడిగా అంటూ మాటలు చెప్పి, మీ అన్న అధికారంలోకి వస్తాడు మీకు అన్ని చేస్తాడు అని పాదయాత్రలో, ప్రచార సభలలో అనేక వర్గాలకు హామీలు ఇచ్చారు. ఇంకో అడుగు ముందుకేసి మీ గ్రామాలలో చెప్పండి మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు అని నమ్మ బలికాడు. జగన్ అనేక వర్గాలకు వారి సమస్యలను పరిష్కరిస్తాను అంటూ హామీలు ఇస్తూ.. వయసు భారమైన వృద్ధులకు వారి ఖర్చుల కోసం ఎవరి దగ్గర చేయి చాచకుండా వారి ఆత్మగౌరవం కోసం 2 వేలు ఉన్న వారి పింఛన్ 3 వేల వరకు పెంచుతా అన్నారు. అధికారం చేతికి వచ్చాక అవ్వా , తాతల పింఛన్ సంవత్సరానికి రూ250/- పెంచుతానన్నారు.
ముమ్మాటికీ నయ వంచనే..
వృధ్యాప్య పింఛన్ ప్రతి సంవత్సరం రూ 250/- పెంచుకుంటూ పోతా అని చెప్పిన జగన్, రెండున్నర ఏళ్ళు దాటిపోయినా పింఛన్ ను పెంచిన పాపాన పోలేదు. కాగా వృద్దులకు ఇచ్చే పింఛన్ ఏ నెల ఫించన్ ఆ నెల లోనే తీసుకోవాలని రూల్ పెట్టాki. ఒక వేళ ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే ఆ నెల పింఛన్ ఇక రాదు. గత టీడీపీ ప్రభుత్వంలో 3 నెలల పింఛన్ ఒకే సారి తీసుకొనే అవకాశం ఉంది. అలాగే ఫించన్ రాష్ట్రంలో ఎక్కడేనా తీసుకోవచ్చు అనే వెసులుబాటు ఉంది. కొంత మంది వృద్ధులు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ లో ఉన్నవారు, పనుల మీద వేరే ఊరికి వెళ్లిన వారు, పట్టణాలలో పిల్లల వద్దకు వెళ్లిన వారు. రెండు, మూడు నెలల తర్వాత కూడా వచ్చి పింఛన్ తీసుకునే వారు. ఇప్పుడు జగన్ ఏ నెల పింఛన్ ఆనెల లోనే తీసుకోవాలని చెప్పడంతో అవ్వా, తాతలు అంత ఆందోళన చెందుతున్నారు.
కోతలు మొదలు..
ఇదీ కాకుండా వృద్దులకు ఉన్నట్టుండి పింఛన్లు నిలిపివేశారు. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, కాజా గ్రామంలో కంకణాల సత్యనారాయణ అనే తాతకు ఆరోగ్యం బాగుంది అని ఆరోగ్య అధికారులు పింఛన్ నిలిపివేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన అట్లూరి సీతారామమ్మకు పింఛన్ రాలేదు. అలాగే సోషల్ మీడియాలో మాకు ఈ నెల పింఛన్ రాలేదు అంటూ వీడియో వస్తున్నాయి. అవ్వా, తాతలు అంటూ, మీ అభిమానం, ఆప్యాయతలు అంటూ నమ్మించి మాయమాటలు చెప్పిన జగన్, గత ప్రభుత్వ పింఛన్ విధానాలు తీసేసి, ఈనెల పింఛన్ ఆనెల లోనే తీసుకోవాలని పెట్టడమే కాకుండా అసలు కొందరికి పింఛన్ నిలిపివేసి వారి నోటి దగ్గర ముద్దను తీసివేయడం అత్యంత అమానవీయ చర్యగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
Must Read ;- సొంత అమ్మ కూడా జగన్కు క్లీన్ చిట్ ఇవ్వలేదే?