కొత్త పీఆర్సీ జీతాలే ఫైనల్..
ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు చెల్లించాలని ఆర్ధిక శాఖ మంగళవారం మరో మెమోను జారీ చేసింది. పాత జీతాలే ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న సమయంలో అందుకు విరుద్ధంగా ఆర్ధిక శాఖ ఈ మెమో జారీ చేయడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఏపీ సచివాలయం, హెచ్ఓడీలు, ట్రెజరీలు, అకౌంట్స్ అండ్ పే, డీడీవోలకు ఆర్థిక శాఖ మెమోను పంపింది. 2022 జనవరి శాలరీని ఉద్యోగులకు సంబంధిత డీడీవోల ద్వారా రివైజిడ్ పే స్కేల్ 2022 ను అనుసరించి చెల్లించాలని ఆదేశించింది. రివైజిడ్ కంసాలిడేటెడ్ పెన్షన్, బెనిఫిట్ లను డీడీవోల ద్వారా చెల్లించాలని సూచించింది.
మినిమం టైం స్కేల్ ప్రకారం జీతాలు చెల్లింపులు..
ప్రభుత్వ శాఖల్లో, యూనివర్సిటీల్లో, సొసైటీల్లో, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రక్ట్ ఉద్యోగులకు మనిమం టైం స్కేల్ ప్రకారం జనవరి 2022 జీతాన్ని ఫిబ్రవరిలో డీడీవోల నుంచి చెల్లించాలని ఆర్ధిక శాఖ జారీ చేసిన మెమోలో పేర్కొంది. ప్రభుత్వం శాఖల్లో పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులకు జనవరి 2022 జీతాన్ని ఫిబ్రవరి 2022న డీడీవోల ద్వారా చెల్లించాలని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పే బిల్లులు ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం డీవియేషన్ లేకుండా చెల్లించాలని స్పష్టం చేసింది. మిగిలిన కేటగిరి ఉద్యోగుల అందరికీ సీఎఫ్ఎంఎస్, ఆప్కోస్ ద్వారా రివైజిడ్ పే స్కేల్స్ ను పీఆర్సీ జీవో ప్రకార అందించాలని ఆర్థిక శాఖ అదేశించింది. ట్రెజరీ ఆఫీసుల్లోని డిస్బరింగ్ ఆఫీసర్లు ఈ సూచనలు పాటిస్తూ జీతాలు చెల్లింపు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
Must Read :-ప్రజాస్వామ్య మూల స్తంబాలు కుప్పకూలాయి..! ఇక జగన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం?!