Threats Made By Rayadurg MLA Kapu Ramachandra Reddy Followers To The Contractor :
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. నవ్యాంధ్రలో పనులు చేసేందుకు, కాంట్రాక్టులు దక్కించుకునేందుకు కంపెనీలన్నీ పోటీలు పడేవి. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న కంపెనీలు కూడా ఏపీలో పనుల కోసం బిడ్లను దాఖలు చేసేవి. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాగానే.. ఏపీలో పనులు చేసేందుకు ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ముందుకు రావడం లేదు. అంతర్జాతీయ కంపెనీలు ఎప్పుడో రాష్ట్రం నుంచి పరారైపోగా.. రాష్ట్రానికి చెందిన కంపెనీలు కూడా జగన్ సర్కారు పిలిచే టెండర్లలో పాలుపంచుకోవడం లేదు. ఈ తరహా దుస్థితికి జగన్ సర్కారు సరిగా బిల్లులు చెల్లించడం లేదని నిన్నటిదాకా వినిపించింది కదా. అది నిజమే అయినా.. మరో ముఖ్య కారణం కూడా కాంట్రాక్టర్లను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అదేంటంటే.. వైసీపీ నేతల బెదిరింపులు. కమీషన్ల కోసం కక్కుర్తి. నిజమే.. ఈ మాట నిజమేనని ఇప్పుడు తేలిపోయింది.
కాపు అనుచరుడి బరితెగింపు
అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రభుత్వ విప్ పదవి దక్కించుకున్న కాపు రామచంద్రారెడ్డి తెలుసు కదా. మైనింగ్ అక్రమార్కుడు గాలి జనార్దన్ రెడ్డితో సంబంధాలున్నాయని గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న కాపు.. ఇప్పుడు తన నియోజకవర్గంలో ఎవరు ఏ పని చేయాలన్నా.. తనకు కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారట. అయితే ఈ విషయం తెలియని ఓ కాంట్రాక్టరు కాపును కలవకుండానే టెండర్లలో తాను దక్కించుకున్న పనులు మొదలుపెట్టి బెదిరింపులకు గురయ్యారట. ఇలా సదరు కాంట్రాక్టర్ ను బెదిరింపులకు గురి చేసింది ఎమ్మెల్యే కాపు కాదు.. ఆయన అనుచరుడు జయరామిరెడ్డి అంట. అంటే కాపు తన నియోజకవర్గాన్ని తన అనుచరులకు పంచి పెట్టారన్న మాట. ఈ బెదిరింపుల పర్వంలో జయరామిరెడ్ది నేరుగా పనులు జరుగుతున్న ప్రదేశానికి వచ్చిఅక్కడ పనులు చేస్తున్న వారిని తీవ్ర స్థాయిలో బెదిరించారట. తన వద్దకు కాంట్రాక్టర్ వచ్చి మాట్లాడకపోతే.. పగిలిపోద్దని, తక్షణమే పనులు ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారట.
అసలేం జరిగిందంటే..?
రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 17 కోట్ల నిధులు మంజూరు చేసింది. డీఎంసీ అనే సంస్థ కాంట్రాక్టును సొంతం చేసుకుని పనులు ప్రారంభించింది. విషయం తెలిసిన కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు జయరామరెడ్డి కాంట్రాక్టర్ను కలిసి వాగ్వివాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులెలా చేస్తారని ప్రశ్నించారు. పనులు ఆపకుంటే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా పనులు నిలిపివేయకపోతే అద్దాలు పగిలిపోతాయి. మా మనుషులు వస్తున్నారు. ఒక్క సైగ చేస్తే చాలా మొత్తం పగలగొట్టి వెళతారు అని జయరామిరెడ్డి బెదిరించారట. ఈ బెదిరింపులకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోగా.. కాపు మరోమారు బుక్కైపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన వారంతా.. వీరు మారరు.. ఏపీకి కాంట్రాక్టర్లు రారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Must Read ;- మళ్లీ జగన్ బాదుడు.. జనం బెంబేలు











