ఆన్లైన్లో గదులు బుకింగ్ చేసుకున్న భక్తులు ప్రస్తుతం తిరుమలలోని సీఆర్వో ఆఫీసుకు వెళ్లి అక్కడి నుంచి సబ్ ఎంక్వైరీ కార్యాలయానికి చేరుకుని గదులు పొందుతున్నారు. దీని కోసం భక్తులు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది . ఈ పద్దతిలో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు టికెట్లు అలిపిరి చెక్ పాయింట్ వద్ద స్కాన్ చేసిన వెంటనే మెసేజ్ ద్వారా మొబైల్ నంబర్లకు సబ్ ఎంక్వైరీ ఆఫీసు వివరాలు తెలియజేస్తామన్నారు. భక్తులు నేరుగా అక్కడికి వెళ్లి గదులు పొందవచ్చని చెప్పారు. మరో పది రోజుల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈవో తెలిపారు. ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకునే భక్తులు అదే స్క్రీన్పై గదులను బుక్ చేసుకునే విధంగా టీటీడీ వెబ్సైట్లో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు.
కడప సాక్షిగా ఒక్కటయిన ఎస్సీ వర్గాలు.. నామినేషన్ రోజే జగన్కి షాక్..!!
కడప జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డికి సహాయ...