కొన్ని ఘటనలు వినడానికి కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. మరి కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇంకొన్ని చాలా బాధను కలిగిస్తాయి. మరి ఈ మూడు భావాలు కలిగలిపిన ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్ జిల్లాలో.
ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని రైల్వేస్టేషన్కి చేరుకున్నాడు. అతను అనుకున్నట్లుగానే రైలు కింద పడ్డాడు. ఇక్కడే ఒక చిత్రం చోటుచేసుకుంది. అతని శరీరం రెండు ముక్కలుగా విడిపోయింది. నడుము పై భాగం ఒక నాలాలో పడింది. నడుము కింది భాగం రైలుపట్టాల వద్దే ఉండిపోయింది. అతని అరుపులకు గుమిగూడిన జనం పోలీసులకు విషయం తెలియజేశారు. స్థానికులతో అతను మాట్లడడానికి ప్రయత్నించాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి రైలు కింద పడినట్లుగా బాధితుడే తెలిపాడు. ఆ ప్రయత్నంలోనే ఇలా జరిగినట్లు అక్కడి ప్రజలతో తన బాధను చెప్పుకున్నారు
అక్కడికి చేరుకున్న పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో 12 గంటల పాటు పోరాడి చివరికి ప్రాణాలు విడిచాడు హర్షవర్థన్. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అతను రెండు ముక్కలైనా 12 గంటలపాటు ప్రాణాలతో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. వారి కుటుంబ సభ్యుల వివరాలు కనుక్కుని వారికి విషయం తెలయజేశారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు.
Must రీడ్ ;- ఇంటి పట్టా రాలేదని ఆత్మహత్య..!